ఎందుకో తెలుసా : 5 కి.మీటర్ల కోసం హెలికాప్టర్ వాడిన BJP మంత్రి

  • Published By: madhu ,Published On : December 30, 2019 / 07:11 AM IST
ఎందుకో తెలుసా : 5 కి.మీటర్ల కోసం హెలికాప్టర్ వాడిన BJP మంత్రి

కేవలం ఐదు కిలోమీటర్ల ప్రయాణించాలంటే..మీరు ఏం చేస్తారు. అదేం ప్రశ్న. బైక్ మీద కానీ, బస్సు, లేదా ఆటో..క్యాబ్, ఇలా ఎన్నో రవాణా మార్గాలను ఉపయోగించుకుని వెళుతాం అంటారు. కదా..కానీ ఓ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం హెలికాప్టర్ వాడారు. దీంతో ఆయన ఇప్పుడు వార్తలెకెక్కారు. ఆందోళలన కారణంగా ఆయన హెలికాప్టర్ ఎక్కాల్సి వచ్చిందంట. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. 

అస్సాం రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజెన్ బోర్తాకుర్ కన్నుమూశారు. దీంతో పార్టీ ఘనంగా నివాళులర్పించింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వాశర్మ హాజరు కావాల్సి వచ్చింది. కానీ అప్పటికే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా నడుస్తున్నాయి. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్తలు గుహవటి – తేజ్ పూర్ జాతీయ రహదారిని దిగ్భందించారు.

దీంతో తేజ్ పూర్‌కు ఎలా వెళ్లాలని మంత్రి ఆలోచించారు. రోడ్డు మార్గాన వెళితే..ఆందోళనకారులు అడ్డుకుంటారని భావించి..ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 5 కి.మీటర్ల దూరంలోని తేజ్ పూర్‌కు హెలికాప్టర్ వెళ్లి నివాళులర్పించి వచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. 

Read More : బైక్ ఆపి లైసెన్స్ అడుగుతారని అనుకున్నాడు..కానీ..