Chintan Shivir: చింతన్ శిబిర్ సమావేశాల్లో భారీ మార్పులకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ చింత‌న్ శిబిర్ స‌మావేశాలు మే 15 ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన సీడబ్ల్యూసీ భారీ మార్పులకు ఆమోదం తెలిపింది. 50 శాతం ప‌ద‌వులు 50 ఏళ్ల‌లోపు వారికే ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Chintan Shivir: చింతన్ శిబిర్ సమావేశాల్లో భారీ మార్పులకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్

Sonia Gandhi (2)

 

 

Chintan Shivir: కాంగ్రెస్ చింత‌న్ శిబిర్ స‌మావేశాలు మే 15 ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన సీడబ్ల్యూసీ భారీ మార్పులకు ఆమోదం తెలిపింది. 50 శాతం ప‌ద‌వులు 50 ఏళ్ల‌లోపు వారికే ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప‌ద‌వుల్లో ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కు స‌మాన ప్రాతినిధ్యం కల్పించింది. ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి- ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్ర‌మే అనే నిర్ణయానికి వచ్చారు.

అయిదేళ్లు పార్టీలో క్రియాశీల‌కంగా ఉంటేనే రెండో వ్య‌క్తికి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీ ప‌ద‌విలో అయిదేళ్ల‌కు మించి ఎవ‌రూ కొనసాగకూడదు. జాతీయ, రాష్ట్ర‌, జిల్లా ప‌దాధికారుల ప‌నితీరుపై స‌మీక్ష‌, ప‌నిచేయ‌ని వారి అధికారాల‌కు క‌త్తెర‌ వేసేలా ప్రణాళిక రూపొందించారు.

 

Read Also: కాంగ్రెస్ చింతన్ శివిర్.. సమూల మార్పులకు పార్టీ సిద్ధం

కాంగ్రెస్ పార్టీలో కొత్త‌గా మూడు డిపార్ట్‌మెంట్లు అమల్లోకి రానున్నాయి.
1. ప‌బ్లిక్ ఇన్‌సైట్ డిపార్ట్‌మెంట్
2. నేష‌న‌ల్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్
3. ఎల‌క్ష‌న్ మెనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌

రాబోయే 90 నుంచి 180 రోజుల్లో బ్లాక్ నుంచి జాతీయ‌స్థాయి వ‌ర‌కు అన్ని ప‌ద‌వుల భ‌ర్తీ, మండ‌ల స్థాయి క‌మిటీల ఏర్పాటు జరగాలని నిర్ణయించారు. ఏడాదికోసారి త‌ప్ప‌నిస‌రిగా జాతీయ‌, రాష్ట్ర కాంగ్రెస్ క‌మిటీ స‌మావేశాలు జ‌ర‌గాలి.

స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్ల‌ు అయిన సంద‌ర్భంగా ఆగ‌స్టు 9 నుంచి ప్ర‌తి జిల్లాలో 75 కిలోమీట‌ర్ల పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షుడికి నిర్ణ‌యాలు, అమ‌లులో స‌హాయానికి ప్ర‌త్యేక గ్రూప్‌ ఉండాలి. ప్ర‌తి రాష్ట్రంలో రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీని ఏర్పాటుచేయాలని సమావేశంలో ఖరారు చేశారు.