కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ్, రూ. 750 మాత్రమే..ఎలా పని చేస్తుంది ?

కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ్, రూ. 750 మాత్రమే..ఎలా పని చేస్తుంది ?

Axis Bank

Axis Bank : కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ్మీరు ఎక్కడైనా పేమెంట్ చేయాలంటే కార్డు, స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. కేవలం ఈ వస్తువు ఉంటే చాలు. ప్రస్తుత డిజిటల్ యుగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు బ్యాంకులు వినూత్న ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి. SBI, ICICI బ్యాంకులు తమ మొబైల్ యాప్ ద్వారా కాంటాక్ట్ లెస్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా..యాక్సిస్ బ్యాంకు ఓ నిర్ణయం తీసుకుంది. కాంటాక్ట్ లెస్ పేమెంట్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంటాక్ట్‌లెస్ పేమెంట్ డివైజ్‌లను లాంచ్ చేసింది. నేరుగా కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు లింక్ అయి ఉంటాయి. డెబిట్ కార్డుల్లాగానే పనిచేస్తాయని చెప్పవచ్చు. థేల్స్ అండ్ ట్యాపీ టెక్నాలజీస్ తో యాక్సిస్ చేతులు కలిపింది. మాస్టర్ కార్డ్ ప్లాట్ ఫామ్ పై ఈ డివైజ్ లు అందుబాటులో ఉంటాయి.

యాక్సిస్ బ్యాంకు వేర్ ఎన్ పే యాక్సెసరీలు బ్యాండ్, కీ ఛెయిన్, వాచ్ లూప్ ల రూపంలో అందుబాటులో ఉన్నాయి. యూజర్లు పేమెంట్ చేయడానికి స్మార్ట్ ఫోన్లు, వాలెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ల కోసం ఈ వేరబుల్ డివైజ్ లు బాగా పనిచేస్తాయి. కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్లను ఒకే చెప్పే బిజెనెస్ మెన్స్ వద్ద వీటి ద్వారా పేమెంట్ చేయవచ్చు. రూ. 5 వేల వరకు చెల్లింపులు చేయవచ్చు. రూ. 5 వేల కంటే ఎక్కువ పేమెంట్లు చేయాల్సి వస్తే..మాత్రం పిన్ నంబర్ అవసరం ఉంటుంది. POS మెషిన్ దగ్గర ఈ డివైజ్ ను అలా..ఇలా..కదిలించాల్సి ఉంటుంది. ఇక ఈ డివైజ్ ధర వద్దకు వస్తే..రూ. 750కి విక్రయిస్తోంది. అకౌంట్ ఉన్న యాక్సిస్ బ్యాంకు బ్రాంచీల్లో డబ్బులు చెల్లించి వీటిని కొనుక్కోవచ్చు. 10 శాతం CASH BACK ఆఫర్ కూడా ఇస్తోంది.