చర్చల ద్వారా అయోధ్య సమస్య పరిష్కరించుకుందాం: శ్రీ శ్రీ రవిశంకర్ 

  • Published By: chvmurthy ,Published On : March 8, 2019 / 10:00 AM IST
చర్చల ద్వారా అయోధ్య సమస్య పరిష్కరించుకుందాం: శ్రీ శ్రీ రవిశంకర్ 

ఢిల్లీ : అయోధ్య సమస్యను చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కారించుకుందాం అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.  అయోధ్య వివాద పరిష్కారానికి  సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్ధాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఒకరు. ఈ సందర్బంగా ఆయన ట్విట్టర్ లో సుప్రీం తీర్పుపై స్పందించారు.
Also Read : సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు

“ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ..కలల్ని నిజంచేసుకుంటూ…దీర్ఘకాలంగా ఉన్న సమస్యను సంతోషంగా పరిష్కరించుకుందాం. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించుకుంటూ…. ఈ లక్ష్యాల సాధన కోసం మనమంతా కలిసిముందుకెళ్ళాలి ” అని ట్విట్టర్ లో పేర్కోన్నారు. అయోధ్య  సమస్యను మధ్యవర్తుల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామని గత  కొంత కాలంగా శ్రీశ్రీ రవిశంకర్  చెపుతూ వస్తున్నారు.

 Sri Sri Ravi Shankar  on Ayodhya issue

 

Also Read : బిగ్ డెసిషన్ : ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ సీజ్