అయోధ్యలో మోడీ నాటిన మొక్క పారిజాతం..విశేషాలు

  • Published By: madhu ,Published On : August 5, 2020 / 02:23 PM IST
అయోధ్యలో మోడీ నాటిన మొక్క పారిజాతం..విశేషాలు

ఎంతో మంది ఉత్కంఠగా, భక్తితో ఎదురు చూసిన మహత్తర ఘట్టం..అయోధ్య రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం పూర్తయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నో దశాబ్దాలు ఎదురు చూసిన కల సాకారం అయినందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.



అయోధ్య మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మారు మోగింది. అయితే..ఇక్కడ భూమి పూజలో పాల్గొనే ముందు..వివిధ ఆలయాలను ప్రధాని మోడీ సందర్శించారు. పూజ కార్యక్రమం జరిగే ప్రాంతంలో మోడీ..‘పారిజాత’ను మొక్కను నాటారు. కానీ..ఈ మొక్కనే ఎందుకు నాటారు ? అనే దానిపై ఆసక్తి కనబరిచారు.

పారిజాతం మొక్క ఏంటీదీ ? దీనివల్ల ఉపయోగాలు ఏంటీ ? అనే దానిపై సెర్చ్ చేశారు. ఈ చెట్టు 10 నుంచి 15 అడుగుల వరకు పెరుగుతుందంట. చెట్టుకు పూలు ఎక్కువగా పూస్తుంటాయి. ఇందులో ఔషధగుణాలు ఉన్నాయని అంటారు.



పైల్స్, గుండె సంబంధిత వ్యాధులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలు తీరుతాయని వెల్లడిస్తున్నారు. పూలను గ్రైండ్ చేసి గుజ్జులో తేనే కలిపి తాగితే..పొడ దగ్గు తగ్గడం, చర్మ రోగాలు నయం అవుతాయని చెబుతున్నారు. ఈ రసం తాగితే జ్వరం తగ్గుతుందంటున్నారు.

దేవతలకు పారిజాత పుష్పాలు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ఈ పూల నుంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు.
పారిజాత పుష్పాన్ని శ్రీ కృష్ణుడు స్వర్గం నుండి తీసుకరావడానికి ప్రయత్నించి కష్టాలో పడుతాడని పురాణాలు చెబుతున్నాయి.



సత్యభామకి బహుకరించిన ఈ చెట్టు..ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకి జిల్లాలో కింటూర్ గ్రామంలో ఉందని టాక్.
పుష్పాలు అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో ఉంటాయి.  ఐదు రేకులు కలిగి ఉంటాయి. పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది.