LTTEపై బ్యాన్ పొడిగించిన కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2019 / 07:23 AM IST
LTTEపై బ్యాన్ పొడిగించిన కేంద్రం

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(LTTE)పై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది కేంద్రప్రభుత్వం. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుంది తెలిపింది.ఈ మేరకు మంగళవారం(మే-14,2019)కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది.చట్టవ్యతిరేకమైన కార్యక్రమాల(ప్రివెన్షన్)చట్టం 1967 ప్రకారం ఎల్టీటీఈపై నిషేధాన్ని పొడిగించినట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.ఎల్టీటీఈ నిరంతరం కొనసాగిస్తున్న హింస,హానికర చర్యలు భారతదేశ సామగ్రతను,సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నట్లు ఆ నోటిఫికేషన్ లో తెలిపింది.