Corona Virus : కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లు

కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను క్రియారహితంగా మార్చే కృత్రిమ పప్టైడ్‌లను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) పరిశోధకులు తయారు చేశారు. వీటిని ఎస్‌ఐహెచ్‌ మినీ ప్రొటీన్‌లుగా పేర్కొన్నారు.

Corona Virus : కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లు

Issc (1)

artificial proteins : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగున్నాయి. వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లను తయారు చేశారు. కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను క్రియారహితంగా మార్చే కృత్రిమ పప్టైడ్‌లను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) పరిశోధకులు తయారు చేశారు. వీటిని ఎస్‌ఐహెచ్‌ మినీ ప్రొటీన్‌లుగా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ మానవ కణజాలాల్లోకి ప్రవేశించకుండా ఇవి అడ్డుకొంటాయని పేర్కొన్నారు. వైరస్‌ కణాలను అడ్డుకోవడంతో పాటు వాటినన్నింటిని ఒక్క చోట చేర్చి శరీరంలో ఇతర అవయవాలకు సోకకుండా నిరోధిస్తాయని వెల్లడించారు.

కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గతకొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య మూడు నెలల గరిష్ఠానికి చేరింది. కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కొత్త వేరియంట్‌ కారణమనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను భారీ స్థాయిలో నిర్వహించక తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే వైరస్‌ వ్యాప్తికి గల కారణాలను తెలుసుకోవడం కష్టమేనని అంటున్నారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,518 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

COVID-19: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 25వేలు దాటేసింది. ఇక పాజిటివిటీ రేటు 1శాతం దాటేసింది. ఒమిక్రాన్‌ వేరియంట్, దాని సబ్ వేరియంట్ల కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని TIGS డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. కరోనా కేసులు పెరిగినా వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందన్నారు. కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని మిశ్రా తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కీలకమైన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను అధికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆస్పత్రిలో చేరే ప్రతిఒక్కరి శాంపిల్స్ సీక్వెన్సింగ్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ తరహా వైరస్‌లు ఎప్పుడూ మార్పులు చెందుతూనే ఉంటాయన్నారు.