Pamban Sea Bridge : పంబన్ బ్రిడ్జిని ఢీ కొట్టిన భారీ నౌక

తమిళనాడు రామేశ్వరంలోని చారిత్రక పంబన్ వంతెనకు తృటిలో ప్రమాదం తప్పింది.

Pamban Sea Bridge : పంబన్ బ్రిడ్జిని ఢీ కొట్టిన భారీ నౌక

Pamban

Pamban Sea Bridge  తమిళనాడు రామేశ్వరంలోని చారిత్రక పంబన్ వంతెనకు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం మధ్యాహ్నం రెండు టగ్​ బోట్లతో కలిసి ఓ భారీ నౌక(బార్జ్).. బ్రిడ్జి షెర్జర్ స్పాన్ దాటుతూ వెళ్తున్న సమయంలో బ్రిడ్జి పిల్లర్ ని ఢీకొడుతూ వెళ్లింది. బ్రిడ్జి దాటిన తర్వాత మరో కంట్రీ బోటును కూడా ఈ బార్జ్ ఢీకొట్టింది. దీంతో స్థానిక మత్స్యకారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 2013లోనూ ఓ నేవీ బార్జ్​.. వంతెనను తాకుతూ వెళ్లడం వల్ల నిర్మాణానికి భారీగా నష్టం జరగడమే అందుకు కారణం.

అయితే, గాలివీచే దిశలో ఆకస్మిక మార్పుల కారణంగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో వంతెనకు ఎలాంటి నష్టం జరగలేదని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పంబన్ వంతెన వెంట కొత్త రైలు వంతెన నిర్మాణానికి సంబంధించి కేరళ నుండి ఈ బార్జ్ వచ్చినట్లు తెలిపారు.

కాగా,పంబన్ బ్రిడ్జి…దేశంలోనే సముద్రంపై నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే. 1914 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ వంతెన రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. 1988లో రోడ్డు బ్రిడ్జి నిర్మించేంతవరకు రామేశ్వరానికి ఇదే ఏకైక మార్గం.