Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల్లో అందుకే మంటలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ- మోటార్ సైకిళ్ల వినియోగాన్ని 2030 నాటికి 80శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, సబ్సిడీ వంటి అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు సైతం..

Electric Vehicles: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ- మోటార్ సైకిళ్ల వినియోగాన్ని 2030 నాటికి 80శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, సబ్సిడీ వంటి అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సిద్ధమయ్యారు. పది మంది వాహనాలు కొనుగోలు చేస్తే అందులో ఇద్దరు నుంచి ముగ్గురు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గుచూపినట్లు గతంలో పలు సర్వేలు వెల్లడించాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తుండటంతో పాటు ఛార్జింగ్ సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు.
electric vehicles: బ్యాటరీ లోపాలతోనే ప్రమాదాలు: కేంద్ర కమిటీ
దేశ వ్యాప్తంగా వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు వ్యాపించి దగ్దమైన ఘటనలు చోటు చేసుకోవటంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మందగించాయి. అయితే వేసవి కాలం కావడంతో వాహనాల్లో మంటలు వ్యాపిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు వ్యాపించి దగ్దమైన ఘటనలు చోటు చేసుకోవటంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్యాప్తుకు ఆదేశించారు. భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు ఎందుకు చెలరేగుతున్నాయనే అంశాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Electric Vehicles : షాకింగ్ న్యూస్, ఎలక్ట్రిక్ వాహన ధరలు పెరుగుతాయా?
అందరూ అనుకుంటున్నట్లు ఎలక్ట్రిక్ వాహనాలు దగ్దం కావడానికి వేసవి కాలం కారణం కాదని, బ్యాటరీలో లోపాల కారణంగానే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నివేదికలో పేర్కొన్నారు. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు, సరియైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను కంపెనీలు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయని, అందుకే వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయని డీఆర్డీవో నివేదికలు స్పష్టం చేశారు. అంతేకాక ఖర్చు తగ్గించుకునేందుకు లో గ్రేడ్ మెటీరియల్ ను ఉద్దేశ పూర్వకంగానే ఉపయోగించడం కూడా ప్రమాదాలకు కారణమని డీఆర్డీవో నివేదిక స్పష్టం చేసింది. మరి కంపెనీల వైఖరి బయటపడటంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
- Job Vacancies : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా లక్షల ఉద్యోగాలు
- Agnipath : ఇక సైన్యంలో రెగ్యులర్ సర్వీస్ ఉద్యోగాలుండవా?
- Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు
- Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్
- Central Govt : ఇంధన కొరతకు చెక్..రంగంలోకి దిగిన కేంద్రం
1BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
2Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
3Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
4Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
5Godfather: గాడ్ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
6Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
8Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
9Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
10The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్తో రిలేషన్పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!