Pegasus Scandal : దీదీ కీలక నిర్ణయం..పెగాసస్ గుట్టు తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు

పెగాసస్ ఫోస్ హ్యాకింగ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్​ను ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

Pegasus Scandal :  దీదీ కీలక నిర్ణయం..పెగాసస్ గుట్టు తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు

Mamata

Pegasus Scandal పెగాసస్ ఫోస్ హ్యాకింగ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్​ను ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. వాస్తవానికి ఈ పని కేంద్రమే చేయాల్సిందని..కానీ ఈ విషయంపై మోదీ సర్కారు మౌనంగా ఉండిపోయిందని మమత విమర్శించారు. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఈ కమిషన్​లో.. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​ సభ్యులుగా ఉన్నారు.

READ  Congress On Pegasus Spyware : అమిత్ షా రాజీనామా చేయాలి..మోదీపై విచారణ జరగాలి

పెగాసస్ ద్వారా న్యాయవ్యవస్థ, పౌర సమాజంతో పాటు ప్రతి ఒక్కరినీ నిఘా నీడలో ఉంచారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తుందని భావించాం. కానీ వారు అలా చేయలేదు. పెగాసస్​పై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించిన తొలి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. రాష్ట్రానికి చెందిన కొందరి పేర్లు పెగాసస్ టార్గెట్ లిస్ట్ లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా హ్యాకింగ్​కు పాల్పడటంపై కమిషన్ విచారణ చేపడుతుందని మమత తెలిపారు. కాగా,టీఎంసీలో నెం.2గా ఉన్న మమత మేనల్లుడు మరియు ఎంపీ అభిషేక్ బెనర్జీ ఫోన్ ని కూడా పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన  విషయం తెలిసిందే.