భద్రాచలం రాములోరి కళ్యాణానికి ఆన్‌లైన్‌లో టికెట్లు రెడీ

  • Published By: chvmurthy ,Published On : March 1, 2020 / 08:47 AM IST
భద్రాచలం రాములోరి కళ్యాణానికి ఆన్‌లైన్‌లో టికెట్లు రెడీ

తెలంగాణ లో  ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  భద్రాచలంలో ఏప్రిల్‌ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలు తిలకించేందుకు దేవస్థానం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభించింది. భక్తులు టిక్కెట్లను  www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. 

భధ్రాచలంలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 2వ తేదీన స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం, 3న స్వామివారి మహాపట్టాభిషేకం వీక్షించేందుకు రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 విలువతో సెక్టార్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామని దేవాలయ అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు 08743-232428 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.