Bharat Biotech: భారత్‌ బయోటెక్‌ ఉదారత..శబరిమలలో అన్నదానానికి రూ.కోటి విరాళం..

భారత్‌ బయోటెక్‌ MD Dr. కృష్ణ ఎల్ల ఉదారత చాటుకున్నారు. శబరిమలలో అన్నదానానికి రూ.కోటి విరాళం అందజేశారు.

Bharat Biotech donate Rs. 1 Cr for Sabarimala Annadhanam : శీతాకాలం వచ్చిదంటే శబరి గిరులు ‘స్వామియే శరణం అయ్యప్పా’అని మారుమ్రోగిపోతుంటాయి. అయ్యప్ప భక్తులు మాల దీక్షలతో స్వామిని దర్శించుకోటానికి తండోపతండాలుగా వస్తుంటారు. అలా వచ్చే భక్తులు భోజనాల కోసం శబరి మలలో అన్నదానం చేస్తుంటారు. కానీ కరోనా వల్ల గత ఏడాది అన్నదానం నిలిపివేశారు.

Read more : వెంకన్నపై అంబానీ భక్తి : 1,11,11,111 విరాళం  

మరి ఏడాది దాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. ఈక్రమంలో ఔషధ సంస్థ భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల ఉదారత చాటుకున్నారు. అయ్యప్ప భక్తుల కోసం అన్నదానం కింద రూ.కోటి విరాళం అందించారు. శబరిమల కార్యనిర్వాహక అధికారి వి.కృష్ణకుమార్‌ వారియర్‌కు ఈ విరాళాన్ని ఆన్‌లైన్‌ ద్వారా అందజేశారు. అనంతరం ఎండీ ఎండీ కృష్ణ ఎల్ల సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. భారత బయోటెక్ ఎండీ డా.కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లతో కలిసి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.

Read more : కొడుకు 9th బర్త్ డే..రూ.9 కోట్ల కారు గిప్ట్ ఇచ్చిన తండ్రి : భారతీయ బిలియనీర్ల లగ్జరీ లైఫ్ స్టైల్

అన్నదాన కార్యక్రమం కోసం ఆలయానికి రూ.కోటి విరాళం ప్రకటించిన డా.కృష్ణ ఎల్ల దంపతులకు ట్రావెన్‌కోర్‌ దేవస్వాం బోర్డు అధ్యక్షుడు అనంతగోపన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, శబరిమల అభివృద్ధిలో సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డా.కృష్ణ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు