Bharat Biotech : భారత్​ బయోటెక్ ​ ప్లాంట్​కు కేంద్ర భద్రత

యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ "కోవాగ్జిన్‌" తయారీదారు భారత్ బయోటెక్​ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

Bharat Biotech : భారత్​ బయోటెక్ ​ ప్లాంట్​కు కేంద్ర భద్రత

Bharat Biotech

Bharat Biotech యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ “కోవాగ్జిన్‌” తయారీదారు భారత్ బయోటెక్​ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.హైదరాబాద్​లోని భారత్​ బయోటెక్​ ప్లాంట్​ ఇకపై సీఐఎస్​ఎఫ్​ భద్రత కల్పించనుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) లోని భద్రతా నిపుణుల సమీక్షా సమావేశం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి

శామీర్​పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షించనున్నారు. వచ్చే వారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం..ప్లాంట్​ను తమ అధీనంలోకి తీసుకోనుంది.

దేశం యొక్క వైద్య మరియు ఆరోగ్య భద్రత నిర్ధారణలో ఈ సంస్థ ఒక ముఖ్యమైనది. ఈ సంస్థ ఉగ్ర ముప్పుని ఎదుర్కొంటుంది. కాబట్టి హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ సంస్థకి సిఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించనుందని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Read:Corona Vaccine : వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా పాలు ఇవ్వొచ్చు, నిపుణుల స్పష్టత