Doctor Couple Killed : నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే డాక్టర్ దంపతుల దారుణ హత్య

రాజస్తాన్ లో ఘోరం జరిగింది. డాక్టర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే డాక్టర్‌ దంపతులను దుండగుడు కాల్చి చంపారు. భరత్‌పూర్‌ కి చెందిన సుదీప్‌ గుప్తా డాక్టర్. ఆయన భార్య సీమా గుప్తా కూడా డాక్టరే. శుక్రవారం(మే 28,2021) మధ్యాహ్నం సుదీప్ గుప్తా దంపతులు తమ కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌ వచ్చి వారిని అడ్డుకున్నారు.

Doctor Couple Killed : నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే డాక్టర్ దంపతుల దారుణ హత్య

Doctor Couple Killed

Doctor Couple Killed : రాజస్తాన్ లో ఘోరం జరిగింది. డాక్టర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే డాక్టర్‌ దంపతులను దుండగుడు కాల్చి చంపారు. భరత్‌పూర్‌ కి చెందిన సుదీప్‌ గుప్తా డాక్టర్. ఆయన భార్య సీమా గుప్తా కూడా డాక్టరే. శుక్రవారం(మే 28,2021) మధ్యాహ్నం సుదీప్ గుప్తా దంపతులు తమ కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌ వచ్చి వారిని అడ్డుకున్నారు.

ఒక వ్యక్తి బైక్‌ దిగి నేరుగా కారు దగ్గరికి వచ్చాడు. వారు ఎవరో తెలుసుకునేందుకు సందీప్‌ కారు అద్దాన్ని దించాడు. అంతే ఆ దుండగుడు తుపాకీతో దంపతులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దంతో అటుగా వెళ్తున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతడి చేతిలో గన్ ఉండటంతో ఎవరూ అడ్డుకునే సాహసం చెయ్యలేకపోయారు. డాక్టర్ దంపతులు చనిపోయారని నిర్ధారించుకున్నాక నిందితులు బైక్ పై పారిపోయారు. కాల్పుల దృశ్యాలు స్థానికంగా ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. గంటల వ్యవధిలోనే కాల్పులు జరిపిన నిందితుడిని గుర్తించారు. ప్రతీకారంతోనే సుదీప్‌ దంపతుల హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. 2019లో వీరిద్దరూ ఓ మహిళ హత్య కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చారు. చనిపోయిన మహిళతో సందీప్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు అప్పుడు పోలీసులు జరిపిన విచారణలో తేలింది. దీంతో సుదీప్‌, ఆయన భార్య సీమాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ మహిళ సోదరుడే ఇప్పుడు సుదీప్ దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.