బిగ్ బ్రేకింగ్ : 21న అయోధ్య నిర్మాణం ప్రారంభం

  • Published By: chvmurthy ,Published On : January 30, 2019 / 01:24 PM IST
బిగ్ బ్రేకింగ్ : 21న అయోధ్య నిర్మాణం ప్రారంభం

ప్రయాగ్ రాజ్: ఫిబ్రవరి 21 న అయోధ్యలో  రామాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది.  కుంభమేళా సందర్భంగా బుధవారం ఇక్కడ సమావేశమైన సాధు సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో సమావేశమైన 500 మందిసాధు సంతులు ఈ తీర్మానం చేశారు.

ధర్మ సంసద్ ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కోర్టు పరిధిలోని అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు విశ్లేషకులు. ఎన్నికల సమయంలో మళ్లీ రామజన్మభూమి, రామ మందిర నిర్మాణాలు లేవనెత్తటం వెనక రాజకీయ వ్యూహం ఉందనే ఆరోపణలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ఫాలో కావాలని.. ఇష్టానుసారం ఎలా ప్రకటిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఫిబ్రవరి 21న రామ మందిర నిర్మాణాన్ని సాధు సంతులు ఎలా ప్రారంభిస్తారనేది ఆసక్తిగా మారింది.

 

Ram Mandir ka shilanyas in Ayodhya on 21st Feb : Resolution passed by 500 seers led by Swaroopanand Saraswati at the #KumbhMela2019 today. A rival Dharam Sansad of the VHP starts tom. That pix btw is what the #RamMandir will look like as and when it gets built. pic.twitter.com/04FShQfo9I