Covid-19 : 87 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్

87 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Covid-19 : 87 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్

Covid 19

Doctors infected with Covid: బిహార్​లోని ఆస్పత్రుల్లో కరోనా తీవ్ర కలకలం రేపింది. 87మంది డాక్టర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. బీహార్ లోని నలంద మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో 87మంది డాక్టర్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని బీహార్ రాజధాని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ సోమవారం (జనవరి 3,2022) వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన డాక్టర్లంతా పాట్నాలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్షిక సమావేశానికి హాజరయ్యారు. 24 గంట్లో అంటే జనవరి 2న 352 కొత్త కేసులు నమోదు కావటంతో బీహార్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.రాష్ట్రంలో మొత్తం 1,074 కోవిడ్-19 కేసులు ఉన్నాయి.

Read more : feast in Gents Only:మాంసంతో ఉత్సవం..పురుషులు భోజనం చేశాక..అరిటాకులు ఎండిపోయే వరకు మహిళలు రాకూడదు

కరోనా సోకిన వైద్యులందరినీ సంస్థాగత క్వారంటైన్​కు వెళ్లాలని సూచించామని..వారి కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టామని అధికారులు తెలిపారు. మూడు ఆస్పత్రుల్లో సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’ అని అధికారులు స్పష్టం చేశారు.ఎన్ఎంసీహెచ్​లో మొత్తం 194 మంది నమూనాలకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించగా.. అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 75 మందికి ఆదివారం వైరస్​ నిర్ధరణ అయింది. కొవిడ్​ సోకిన వారిలో ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగతా వారంతా హోం ఐసొలేషన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

పాజిటివ్ సోకిన 87 మంది డాక్టర్లకు చాలా మందికి లక్షణాలు లేవు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వారంతా ఆస్పత్రి క్యాంపస్​లో ఐసొలేషన్​లో ఉన్నారని అధికారులు తెలిపారు.ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే ఈ కరోనా వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది. కరోనా నిర్ధరణ అయిన ఎన్ఎంసీహెచ్ వైద్యుల్లో చాలా మంది డిసెంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఐఎంఏ సదస్సుకు హాజరైన వారే కావడం గమనించాల్సిన విషయం. ఈ కార్యక్రమానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శనివారం పట్నా ఎయిమ్స్​కు చెందిన ఇద్దరు వైద్యులకు సైతం కరోనా సోకినట్లు తేలింది.

Read more : Covid Spike: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత గోవాలో చెలరేగుతున్న కొవిడ్

ఎన్ఎంసీహెచ్​ డాక్టర్లు కరోనా బారినపడిన క్రమంలో పాట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్​ బాధితులతో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించే చర్యలు ముమ్మరం చేసింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో..కాగా..కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు బిహార్​లో అధికంగా ఉన్నారని ఐఎంఏ గతంలో తెలిపింది.