తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..ప్రశంసించిన గ్రామస్తులు

  • Published By: nagamani ,Published On : September 17, 2020 / 01:18 PM IST
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..ప్రశంసించిన గ్రామస్తులు

ప్రపంచమంతా టెక్నాలజీలో ఎంత ముందుకు పోతున్నా దేశం ఏదైనా సమాజంలో స్త్రీ, పురుష బేధభావాలు పూర్తిగా సమసిపోవటంలేదు. చదువులోను..ఉద్యోగాల్లోను..టెక్నాలజీలోను పురుషులకు ధీటుగా స్త్రీలు దూసుకుపోతున్నారు. కానీ పితృకర్మలు చేసే ఘటనల్లో మాత్రం స్త్రీలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. తల్లిదండ్రులు..చనిపోతే పురుషులే కర్మలు చేయాలి. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహిస్తారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం మగపిల్లలను కన్నట్లుగానే ఆడపిల్లను కన్నారు…మేమెందుకు చేయకూడదని తల్లిదండ్రులు చనిపోయిన ఘటనల్లో కర్మకాండలు చేస్తున్నారు. అటువంటి ఘటనే జరిగింది బీహార్ లో.


బీహార్‌లోని ఆరా పట్టణంలోని ఎంపీ బాగ్‌ ప్రాంతానికి చెందిన ఉత్తమకుమార్ అనే వ్యక్తి మృతి చెందారు. అతనికి ఒకే కూతురు…కొడుకులు లేరు.ఈ క్రమంలో ఉత్తమకుమార్ మృతదేహాన్ని కర్మకాండలు చేయటానికి శ్మశానవాటికకు తీసుకువచ్చారు. కానీ మా నాన్న బ్రతికి ఉన్నప్పుడు నన్ను కొడుకులాగానే చూసుకున్నారు..కాబట్టి తండ్రి చికితికి నేనే కొరివి పెడతానని కుమార్తె నేహా కుమారి ముందుకొచ్చింది. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.కానీ రోజులు మారుతున్నాయి..సంప్రదాయాలు కూడా మారాల్సిన అవసరముందని వారు కూడా ఆమెను సపోర్ట్ చేసి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు. తండ్రికి తలకొరివి పెట్టించారు.



https://10tv.in/uk-man-uses-real-snake-face-mask-in-local-bus/
ఈ సందర్బంగా నేహా కుమారి మాట్లాడుతూ నా తండ్రికి తలకొరివి పెట్టి ఆయన చివరి కోరికను తీర్చానని.. ఆయన కోరుకున్నట్లు ఆయన చితికి నిప్పంటించి కొడుకునయ్యానని కూతురుగా నేనుండగా మరెవరో నా తండ్రి కార్యాలు చేయటం నాకు ఇష్టం లేదు..నా తండ్రికి కొడుకునైనా కూతురునైనా నేను కాబట్టి నా బాధ్యతను నెరవేర్చానని తెలిపింది.


దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ..ఉత్తమ్ బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడూ అంటుండేవాడు..నా కూతురే నాకు తల కొరివి పెట్టాలి..నా కర్మకాండలన్నీ ఆమె చేయాలని అనేవాడు..నేడు ఆయన కూతురు ఈ పనులు చేయటంతో ఆయన ఆత్మ శాంతిస్తుందని దానికి ఆమెకు మేమంతా అండగా ఉంటామని తెలిపారు.