Minister’s Son: తుపాకీతో రెచ్చిపోయిన మంత్రి కొడుకు!

బీహార్‌ పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు నారాయణ ప్రసాద్ కుమారుడు రెచ్చిపోయాడు.

Minister’s Son: తుపాకీతో రెచ్చిపోయిన మంత్రి కొడుకు!

Minister

Minister’s Son: బీహార్‌ పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు నారాయణ ప్రసాద్ కుమారుడు రెచ్చిపోయాడు. తన ఇంటి పక్కన ఉన్న మామిడి తోటలో పిల్లలంతా చేరి ఆటలు ఆడుకోవడం మంత్రి కొడుకు ఆవేశానికి కారణమైంది. దీంతో అతను తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తన సిబ్బందితో కలిసి కనిపించినవారందరినీ చితకబాదాడు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని బాధితుడి బంధువులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ చంపారన్ జిల్లా బేతియా సమీపంలోని హర్దియా గ్రామంలో బీజేపీ నేత నారాయణ ప్రసాద్ సాహ్​ ఇల్లు ఉంది. ఆ పక్కన ఉన్న మామిడి తోటలో కొందరు పిల్లలు చేరి ఆడుకుంటున్నారు. అయితే, అక్కడ ఆటలు ఆడేందుకు వీల్లేదని, తక్షణమే వెళ్లిపోవాలని మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్ సాహ్​, అతడి ఇంటి సిబ్బంది చెప్పారు. ఇందుకు పిల్లలు నిరాకరించగా.. కొందరు పెద్దలు కూడా వారికి తోడయ్యారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వివాదం తీవ్రం కావడంతో వెనక్కి వెళ్లి నాలుగు వాహనాల్లో అనుచరులను తీసుకొచ్చిన బబ్లూ.. వారితో అక్కడివారిపై దాడి చేయించాడు. అంతేకాదు ఆవేశంతో ఊగిపోయిన బబ్లూ ప్రసాద్.. తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయాలవగా.. జనార్ధన్​ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామ ప్రజలు.. మంత్రి ఇంటిపైకి దండెత్తారు. అయితే, ఈలోపై బబ్లూ అక్కడి నుంచి పరారవగా.. స్థానికులు మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. మంత్రి ఇంటి నుంచి ఒక పిస్టల్‌ను, ఒక రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.