Man Killed : లిఫ్ట్ అడిగిన వ్యక్తి పెట్రోల్ కు డబ్బులు ఇవ్వలేదని హత్య
తమిళనాడులో బైక్ రైడర్ దారుణానికి ఒడిగట్టాడు. లిఫ్ట్ అడిగిన వ్యక్తి పెట్రోలుకు డబ్బు ఇవ్వలేదని హత్య చేశాడు.
Biker killed a man : తమిళనాడులో బైక్ రైడర్ దారుణానికి ఒడిగట్టాడు. లిఫ్ట్ అడిగిన వ్యక్తి పెట్రోలుకు డబ్బు ఇవ్వలేదని హత్య చేశాడు. ఈ ఘటన తిరువణ్ణామలైలో చోటుచేసుకుంది. నిందితుడు ఐటీఐ విద్యార్థిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కలసపాక్కం ప్రాంతానికి చెందిన శంకర్(43) చెన్నై కొలత్తూరులో భవన నిర్మాణ పనులు చేస్తుండేవాడు. ఈనెల 4వ తేదీన కొలత్తూరు వలర్మతినగర్లో గాయాలతో పడివుండగా 108 సిబ్బంది పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.
సంఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాను పరిశీలించగా కొలత్తూరు అంబేద్కర్ నగర్కు చెందిన శశికుమార్ బైక్పై వస్తుండగా శంకర్ లిఫ్ట్ కోరినట్లు తెలిసింది. దీని ఆధారంగా విచారణ జరుపగా శంకర్ లిఫ్ట్ కోరడంతో శశికుమార్ అతన్ని పెట్రోలుకు డబ్బులు అడిగినట్లు, అతను ఇవ్వనందున హత్య చేసినట్లు తెలిసింది. దీంతో శశికుమార్ను పోలీసులు శనివారం అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
మరోవైపు సేలంలోని టాస్మాక్ బార్లో జరిగిన ఘర్షణలో ఓ వ్యాపారి హత్యకు గురయ్యాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం రాత్రి సేలం కిచ్చిపాళయానికి చెందిన వ్యాపారి కృపాకరన్ (40) తన స్నేహితులతో బార్లో మద్యం సేవిస్తుండగా మోహన్ అనే వ్యక్తితో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన మోహన్.. కృపాకరన్పై బీర్ బాటిల్ పగులగొట్టి దాడి చేశారు. కృపాకరన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.