BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి
నీముచ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది దినేష్ కుష్వాహగా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని వృద్ధుడిపై దాడికి పాల్పడుతూ.. నీ పేరేంట్రా..? నీ ఆధార్ కార్డు తీయ్ ముసలోడా అంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. దుర్భాషలాడుతూనే ముఖం మీద కొట్టడం ఆ వీడియోలో ఉంది.
BJP activist attack : మతం పేరిట మానసిక వికలాంగుడు, అందునా వృద్ధుడిపై దాడి చేసి చంపేసినహేయనీయమైన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. దాడి చేసింది బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త కావడంతో ఈ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మానసిక వికలాంగుడైన ఓ వృద్ధుడిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరించడం, మతం పేరిట అతనిపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ఆ వృద్ధుడు విగతజీవిగా కనిపించడంతో.. తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయ విమర్శలు రావడంతో.. పోలీసులు దాడి, హత్య కేసు నమోదు చేశారు.
నీముచ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది దినేష్ కుష్వాహగా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని వృద్ధుడిపై దాడికి పాల్పడుతూ.. నీ పేరేంట్రా..? నీ ఆధార్ కార్డు తీయ్ ముసలోడా అంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. దుర్భాషలాడుతూనే ముఖం మీద కొట్టడం ఆ వీడియోలో ఉంది. పాపం.. ఏ జరుగుతుందో కూడా అర్థం కానీ స్థితిలో ఆ వృద్ధుడు అవస్థ పడ్డాడు. తన దగ్గరున్న డబ్బు సంచి చూపించే ప్రయత్నం చేయగా.. నిందితుడు పదే పదే ఆ వృద్ధుడిపై దాడి చేశాడు.
బాధితుడిని రట్లమ్ జిల్లా సాస్రికి చెందిన భన్వర్లాల్ జైన్గా పోలీసులు గుర్తించారు. ఈయన కుటుంబం రాజస్థాన్లో దైవదర్శనానికి వెళ్లింది. అయితే అక్కడే ఆయన తప్పిపోయాడు. మే 15 నుంచి భన్వర్లాల్ కనిపించకుండా పోయాడని ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి వీడియో వెలుగులోకి వచ్చి అసలు విషయం తెలయడంతో నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు దినేష్ను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.