BJPతో మళ్లీ పొత్తు.. 2021లో కలిసి పోటీ చేస్తాం: పన్నీర్ సెల్వం
భారతీయ జనతా పార్టీ(BJP)తో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట కజగం(AIADMK) పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగనుండగా.. కేంద్ర హోంమంత్రి, Bjp సీనియర్ నాయకుడు అమిత్ షా చెన్నై పర్యటన సందర్భంగా పన్నీర్ సెల్వం ఈ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల పర్యటనలో పార్టీ నాయకులతో ఎన్నికల వ్యూహాన్ని ఆయన చర్చించనున్నట్లు తెలుస్తుంది.
అమిత్ షా Bjp తమిళనాడు యూనిట్ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత.. 2021లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా E పళనిస్వామిని అంగీకరించడానికి BJP సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ నాయకుడు వెల్లడించారు. రాష్ట్రంలో BJP మరియు దాని మిత్రదేశాల మధ్య ఉద్రిక్తత సూచనలు ఉన్నాయి. కరోనావైరస్ మహమ్మారి మధ్య రోడ్షో నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించగా.. ఈ నెల ప్రారంభంలో తమిళనాడులోని పోలీసులు BJP రాష్ట్ర యూనిట్ చీఫ్ ఎల్ మురుగన్ను “వెట్రీ వాల్ యాత్ర” ప్రారంభించిన సమయంలో అరెస్టు చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తుకు అంతరాయం కలిగవచ్చు అని భావించారు.
చెన్నైలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా తెర్వాయ్కండిగై రిజర్వాయర్ను ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. తర్వాత చెన్నె మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసి దివంగత సీఎం జయలలిత చిత్రపటానికి నివాళులు అర్పించారు కేంద్ర హోంమంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం.. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ముందుకు వెళ్తాయని స్పష్టం చేశారు.
We will continue our alliance with BJP: O Panneerselvam, Deputy CM of Tamil Nadu and AIADMK coordinator pic.twitter.com/bC1GIw0PIz
— ANI (@ANI) November 21, 2020