ఓటు వేసిన గౌతమ్ గంభీర్

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 04:20 AM IST
ఓటు వేసిన గౌతమ్ గంభీర్

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం గంభీర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ నుంచి తూర్పు ఢిల్లీ అభ్యర్థిగా అర్విందర్ సింగ్ లవ్వీ పోటీ చేస్తున్నారు.ఆరో దశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతంది.ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు ఇవాళే పోలింగ్ జరుగుతంది.2014 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఆప్,కాంగ్రెస్ లు పనిచేశాయి.