బీహార్ ప్రజలకు ధన్యవాదాలు..మోడీ,అమిత్ షా

  • Published By: venkaiahnaidu ,Published On : November 11, 2020 / 12:41 AM IST
బీహార్ ప్రజలకు ధన్యవాదాలు..మోడీ,అమిత్ షా

BJP claims victory, PM Modi, Amit Shah thank people of Bihar బీహార్‌లోని ప్రతి ఓటరు తమ ప్రాధాన్యత.. అభివృద్ధి మాత్రమే అని స్పష్టంగా పేర్కొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే ఎన్డీయే మంత్రం వెనుక నిలిచారని. ప్రతి ప్రాంతంలో అభివృద్ధి గురించి బీహార్ పౌరులకి తాను భరోసా ఇవ్వాలనుకుంటున్నాను ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

బీహార్‌లో అభివృద్ధి, పురోగతి మరియు సుపరిపాలనను మరోసారి ఎంచుకున్నందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని అమిత్ షా ట్వీట్ చేశారు.

కాగా, 243స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122ఉండగా..125స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. రాష్ట్రాన్ని 15ఏళ్ల పాటు పాలించిన నితీశ్​కుమార్​.. మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.

ఇక,విపక్ష పార్టీల కూటమి మహాఘట్ బంధన్ కూడా చివరివరకు ఎన్డీయేకి గట్టి పోటీనే ఇచ్చింది. 110స్థానాల్లో మహాకూటమి విజయం సాధించింది. ముఖ్యంగా తేజస్వీ యాదవ్​ నేతృత్వంలోని ఆర్​జేడీ.. ఎన్​డీఏతో హోరాహోరీగా తలపడింది.