ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సుజనా చౌదరిని అడ్డుకున్న అధికారులు

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2020 / 05:21 PM IST
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సుజనా చౌదరిని అడ్డుకున్న అధికారులు

బ్యాంక్ ఫ్రాడ్ కేసులో బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై గతంలో సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(నవంబర్-13,2020)ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అమెరికా వెళ్తున్న సుజనా చౌదరిని అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో దేశం విడిచి వెళ్లకూడదని సుజనాకి అధికారులు సూచించారు.

అయితే,తనను అక్రమంగా అడ్డుకున్నారంటూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు సుజనా చౌదరి. తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు సుజానా చౌదరి. కాగా,బ్యాంకులు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారనే ఆరోపణలు సుజానపై ఉన్న విషయం తెలిసిందే.