BJP: బీజేపీకి విరాళాల వెల్లువ.. ఏడాదిలో రూ.614.53 కోట్లు.. తర్వాత స్థానంలో కాంగ్రెస్

ఏడాది కాలంలో దేశంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది బీజేపీ. ఈ పార్టీకి 2021-22కుగాను రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలుగా వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రూ.95.46 కోట్ల విరాళాలు వచ్చాయి.

BJP: బీజేపీకి విరాళాల వెల్లువ.. ఏడాదిలో రూ.614.53 కోట్లు.. తర్వాత స్థానంలో కాంగ్రెస్

BJP: అధికార బీజేపీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో బీజేపీకి రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తాజాగా వెల్లడైంది. బీజేపీతోపాటు పలు జాతీయ పార్టీలు తమ పార్టీకి వచ్చిన విరాళాల గురించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి.

Assam: పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్‌పై విద్యార్థుల దాడి

ఈ విషయాలు తాజాగా వెల్లడయ్యాయి. వివిధ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం.. దేశంలో 2021-22కుగాను బీజేపీకి అత్యధికంగా రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇది ప్రతిపక్ష కాంగ్రెస్ విరాళాలకంటే ఆరు రెట్లు ఎక్కువ కావడం విశేషం. బీజేపీ తర్వాత రెండో స్థానంలో ఉంది కాంగ్రెస్. ఈ పార్టీకి 2021-22కుగాను రూ.95.46 కోట్ల విరాళాలు వచ్చాయి. ఆ తర్వాత రూ.44.54 కోట్ల విరాళాలతో ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. ఇదే కాలానికిగాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.43 లక్షల విరాళాలు మాత్రమే వచ్చాయి. తర్వాత సీపీఎం రూ.10 కోట్లు విరాళంగా పొందింది. నిబంధనల ప్రకారం రూ.20,000 కంటే ఎక్కువ మొత్తం విరాళాలుగా వస్తే వాటి వివరాల్ని ఎన్నికల సంఘానికి సమర్పించాలి.

Bengaluru: మద్యం మత్తులో ఉన్న యువతిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం.. మరో వ్యక్తితో కలిసి దురాగతం

బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇక కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కూడా జాతీయ పార్టీలే. ఈ జాబితాలో కొత్తగా చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. గోవాలో గుర్తింపు పొందిన పార్టీగా నిలిచింది. తాజాగా గుజరాత్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తోంది.