ఏడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2019 / 02:31 PM IST
ఏడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఏడు లోక్ సభ స్థానాలకు లోక్ సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం(ఏప్రిల్-21,2019)రిలీజ్ చేసింది.ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గానికి హర్షవర్థన్,నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి మనోజ్ తివారీ,వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి ప్రవీష్ వర్మ,దక్షిణ ఢిల్లీ స్థానానికి రమేష్ బిదురి,అమృత్ సర్ స్థానానికి హర్ దీప్ పూరి,గోషి నియోజకవర్గానికి హరినారాయణ్ రాజ్ బహర్,ఇండోర్ లోక్ సభ స్థానానికి శంకర్ లాల్వాని పేరును బీజేపీ ప్రకటించింది.