నమో టీవీ కంటెంట్ ను ఢిల్లీ సీఈవోకి సమర్పించిన బీజేపీ

కేవలం ముందస్తు ధ్రువీకరణ కంటెంట్ ను మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయడం జరుగుతుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కు బీజేపీ హామీ ఇచ్చింది.

  • Published By: venkaiahnaidu ,Published On : April 13, 2019 / 12:27 PM IST
నమో టీవీ కంటెంట్ ను ఢిల్లీ సీఈవోకి సమర్పించిన బీజేపీ

కేవలం ముందస్తు ధ్రువీకరణ కంటెంట్ ను మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయడం జరుగుతుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కు బీజేపీ హామీ ఇచ్చింది.

కేవలం ముందస్తు ధ్రువీకరణ కంటెంట్ ను మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయడం జరుగుతుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కు బీజేపీ హామీ ఇచ్చింది. సర్టిఫికేషన్ కోసం కంటెంట్ ను సమర్పించింది. బీజేపీ స్పాన్సర్డ్ నమో టీవీలో ప్ర‌సారం అవుతున్న అన్ని రికార్డ్ ప్రోగ్రామ్‌ల‌కు స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి అని గురువారం (ఏప్రిల్-11,2019) ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ బీజేపీని ఆదేశించిన విషయం తెలిసిందే.

నమో టీవీలో ప్రసారం చేసే ఎలాంటి రాజకీయ ప్రచారాంశమైనా దానికి తప్పనిసరిగా స్థానిక మీడియా సర్టిఫికేషన్‌ సంఘం, ఢిల్లీ మానిటరింగ్‌ కమిటీ ముందస్తు అనుమతి అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంతేగాకాకుండా ముందస్తు ధ్రువీకరణ లేకుండా నమో టీవీలో ప్రసారమవుతున్న రాజకీయ ప్రచారాంశాలను తక్షణమే తొలగించాలంటూ ఢిల్లీ ఎన్నికల ముఖ్య అధికారికి ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీజేపీకి ఉత్తర్వులు పంపారు. నమోటీవీప్రసారాల తీరుపై కాంగ్రెస్‌ కంప్లెయింట్ చేయడంతో ఎన్నికల సంఘం ఈ విధంగా చర్యలు చేపట్టింది. 
Read Also : బెంగాల్ లో అడుగుపెట్టొద్దు : రాహుల్ కు నో ఎంట్రీ అంటున్న మమత