బీజేపీకి ఓటేస్తే భారతమాతకు: ఇతరులకు వేస్తే పాకిస్తాన్‌కు వేసినట్లే

  • Published By: vamsi ,Published On : May 7, 2019 / 02:37 PM IST
బీజేపీకి ఓటేస్తే భారతమాతకు: ఇతరులకు వేస్తే పాకిస్తాన్‌కు వేసినట్లే

బీజేపీ సీనియర్‌ నేత మేనకా గాంధీ తనయుడు, సుల్తాన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మేనకా గాంధీ తరపున సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వరుణ్ గాంధీ.. ప్రతిపక్ష పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులతో తన షూ లేస్ విప్పించుకుంటానని అన్నారు. తమది నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ అంటూ పరోక్షంగా చెప్పుకున్న వరుణ్‌.. నేను సంజయ్ గాంధీ కొడుకుని, మనం దేవుడికి తప్ప ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

భారత మాత కోసం ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలని, తన తల్లి మేనకా గాంధీకి ఓటు వేస్తే భారత మాతకు ఓటు వేసినట్లే అని, హిందుస్తాన్‌లో జీవిస్తున్నప్పుడు భారతమాతకు మాత్రమే ఓటు వేయాలని వేరే పార్టీలకు ఓటు వేస్తే పాకిస్తాన్‌కు ఓటువేసినట్లేనని అన్నారు. ప్రజలు మోనూ, సోనూలను చూసి భయపడొద్దు అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన చంద్ర భద్ర సింగ్‌ని స్థానికులు సోనూ సింగ్ అని పిలుస్తారు. ఆయన సోదరుడు మోనూ సింగ్‌కి స్థానికంగా పేరుంది.  సోనుసింగ్ సుల్తాన్ పూర్‌ ఎంపీ అభ్యర్ధిగా బీఎస్పీ, ఎస్పీ పార్టీల తరపున బరిలో ఉన్నారు.