మూడు రోజుల ముందే : మోడీ సమక్షంలో బీజేపీ మేనిఫెస్టో 

మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ కు కసరత్తు చేస్తోంది. బీజేపీ సంకల్ప్ పాత్ర (మేనిఫెస్టో) రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది.

  • Published By: sreehari ,Published On : April 6, 2019 / 11:27 AM IST
మూడు రోజుల ముందే : మోడీ సమక్షంలో బీజేపీ మేనిఫెస్టో 

మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ కు కసరత్తు చేస్తోంది. బీజేపీ సంకల్ప్ పాత్ర (మేనిఫెస్టో) రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది.

సార్వత్రిక ఎన్నికల వేళ.. జాతీయ రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, సహా పలు జాతీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో ఎన్నికల హమీలను కురిపిస్తున్నారు. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది.

విపక్షాలకు ధీటుగా ప్రచారం చేస్తూ మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ కు కసరత్తు చేస్తోంది. బీజేపీ సంకల్ప్ పాత్ర (మేనిఫెస్టో) రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేయనుంది. 
Read Also : మేనిఫెస్టోలో కీలక అంశాలు చెప్పిన చంద్రబాబు

ఏప్రిల్ 11న తొలి దశ లోక్ సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఎన్నికలకు మూడు రోజుల ముందుగానే బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో.. బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా మేనిఫెస్టో విడుదలకు హాజరయ్యే అవకాశం ఉంది.

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన 20మంంది సభ్యులతో కూడిన పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.  
Read Also : వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల