ఎవరి పని ఇది : బీజేపీ వెబ్ సైట్ హ్యాక్
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. మంగళవారం (మార్చి-5, 2019) బీజేపీ వెబ్ సైట్ www.bjp.org ని ఓపెన్ చేయగానే ఎర్రర్ 522 అని డిస్ ప్లేపై దర్శనమిస్తుంది. బీజేపీ వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు జర్మన్ వైస్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ మోడీ భుజంపై చెయ్యి వేసినట్లుగా అక్కడ కన్పిస్తున్న ఫొటోలను కొందరు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. అయితే ఎవరు బీజేపీ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారన్నది ఇంకా తెలియరాలేదు. బీజేపీ వెబ్ సైట్ హ్యాక్ పై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసింది. బీజేపీ వెబ్ సైట్ ను కనుక మీరు ఇప్పుడు చూడకపోతే.. మిస్ అవుతారని కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జి రమ్య తెలిపారు.
वेबसाइट की रक्षा नहीं कर सकते, देश की क्या करेंगे। pic.twitter.com/CxDroSgtGk
— Zoheb ज़ोहेब زوہیب ઝોહેબ (@Zoheb_Sh) March 5, 2019
Bhaiya aur Bhehno if you’re not looking at the BJP website right now- you’re missing out
— Divya Spandana/Ramya (@divyaspandana) March 5, 2019