ప్రగ్యా ఠాకూర్ కు మళ్లీ అస్వస్థత

ప్రగ్యా ఠాకూర్ కు మళ్లీ అస్వస్థత

Airlifted To Mumbai

BJP’s Pragya Thakur : బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో..ఆమె సిబ్బంది..హుటాహుటిన ముంబాయికి తరలించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. ముంబాయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఆమె అనారోగ్యానికి గురికావడం ఇది రెండోసారి.

గత నెల 19వ తేదీన అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రగ్యా కరోనా బారిన పడి కోలుకున్నారు. 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ప్రగ్యా అరెస్టయ్యారు. అనంతరం 2017 సంవత్సరంలో బెయిల్ పై బయటకు వచ్చారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమెకు బెయల్ మంజూరు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాకుండా..పలు వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె వార్తల్లో నిలిచారు.