Fungal Infections : బ్లాక్ ఫంగస్, అతిగా స్టెరాయిడ్‌లు వాడొద్దు…ఇమ్మ్యూనిటీ పెంచుకొండి

ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కోవిడ్ నుంచి కోలుకున్న కొంతమందికి బ్లాక్ ఫంగస్ వ్యాధి గురవుతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.

Fungal Infections : బ్లాక్ ఫంగస్, అతిగా స్టెరాయిడ్‌లు వాడొద్దు…ఇమ్మ్యూనిటీ పెంచుకొండి

Blck Fungas

Increase Immunity : ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కోవిడ్ నుంచి కోలుకున్న కొంతమందికి బ్లాక్ ఫంగస్ వ్యాధి గురవుతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఒకటో రెండు రోజుల్లో దీనికి సంబంధించి భయపెట్టే వార్తలు ప్రచారం అవుతాయి. కోవిడ్ నుంచి కోలుకొన్నామన్న ఆనందాన్ని కూడా దక్కకుండా, తిరిగి వేలాది మంది ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి అసలు విషయం ఏమిటీ ?

ఎందుకిలా ? :
కరోనా సోకి తీవ్రమైన వారికి చికిత్సలో భాగంగా అధిక శక్తి కలిగిన స్టెరాయిడ్‌లు ఇస్తారు. ఈ స్టెరాయిడ్‌ల వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. మరో పక్క కాలేయము దెబ్బ తింటుంది. దీని వల్ల గ్లూకోస్ రీడింగ్ ఒక్క సారిగా మూడు నాలుగు వందలు దాటే ప్రమాదం వుంది. కరోనా వల్ల ప్రాణం పోయే స్థితి ఉంటే అప్పుడు పెద్ద నష్టాన్ని నివారించడానికి ఈ చిన్ననష్టం తప్పదు అనే ప్రాతిపదికన డాక్టర్ లు స్టెరాయిడ్ లు వాడుతారు.

కానీ ఇటీవల స్టెరాయిడ్‌ల ను యదేచ్ఛగా వాడేస్తున్నారు. వ్యాధి ముదిరి ఇక మామూలు మందులతో లాభం లేదనుకొన్నప్పుడు వాడాల్సిన స్టెరాయిడ్‌ల ను వ్యాధి సోకడం తోటే వాడేస్తున్నారు. ఆస్తమా రోగులు వాడే ఈ స్టెరాయిడ్ వాడండి అని ఇటీవల వీడియోలు వైరల్ అయ్యాయి. స్టెరాయిడ్ లు విషం . వాటిని విచ్చలవిడిగా వాడితే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. నేరుగా మెడికల్ షాప్ కు వెళ్లి కొనుక్కని వాడడం అంటే కోరి కొరివి తో తలగోక్కున్నట్టే అంటున్నారు.

ఇప్పుడేమిటి :
కరోనా నివారణలో భాగంగా బలమైన స్టెరాయిడ్ మందులు వాడిన వారికి వ్యాధి నిరోధక శక్తి బలహీన పడడం వల్ల గాలిలోని ఈ బూజు సోకి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. షుగర్, కాన్సర్, కిడ్నీ ఇన్ఫెక్షన్ లాంటి వ్యాధులు ఉండి కరోనా సోకి నెగటివ్ వచ్చిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాధులు ఉన్న వారికి ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలహీనముగా ఉండడమే కారణం.

ఏమి చెయ్యాలి :
అనేక అంటురోగాల నుంచి రక్షించేది ఇమ్మ్యూనిటి వ్యవస్థే. అది బలంగా ఉంటే కరోనా వచ్చినా ఏమీ కాదు. అలా కరోనా నుండి కేవలం విటమిన్ మాత్రలతో కోల్కొన్న వారికి ఈ వ్యాధి రాదు. దురదృష్టవశాత్తూ కొంత మంది ఇమ్మ్యూనిటిని నమ్ముకోరు. మందులనే నమ్ముతారు. ఉదాహరణకు బిపి తీసుకొందాము. బిపి ఎక్కువైతే నడవడం, ఉప్పు తగ్గించడం, భావోద్వేగాలకు దూరంగా ఉండడం అనే పద్ధతిలో దీన్ని తగ్గించుకోవచ్చు. అవసరం అయితే మందులు వాడాలి. బిపి వచ్చిందా ? టాబ్లెట్ వేసుకొంటే పోతుంది అనే ఆలోచన మంచిది కాదు. షుగర్ వ్యాధి వస్తే వ్యాయామం చెయ్యాలి. రోజుకు నలభై నిముషాలు వేగంగా నడవాలి. పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, నెమ్మదిగా జీర్ణం అయ్యే పదార్థాలు, పీచు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి . షుగర్ వస్తే ఒక మాత్ర .. అటు పైన కొన్ని నెలలకు భోజనానికి ముందు ఒక ఇన్సులిన్ సూది అనుకొనే పద్దతి మంచిది కాదు.

బ్లాక్ ఫంగస్ గురించి అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాన్సర్, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు లాంటివి ఉండి కరోనా సోకి సీరియస్ అయ్యి స్టెరాయిడ్ లు తీసుకొన్న వారు, ఏవో వీడియో లు చూసి కరోనా అతిభయంతో అనవసరంగా స్టెరాయిడ్ లు తీసుకొన్న వారు మాత్రం జాగ్రత్త అంటున్నారు వైద్యులు. ముఖ కండరాలు తిమ్మిరెక్కడం, కళ్ళు ఉబికి ఎర్రబడడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. అనవసరంగా టెన్షన్ పెంచుకొని ముఖం తిమ్మిరెక్కినట్టు ఊహించుకోవద్దు. ఇలాంటి కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రిపోర్ట్ కాలేదు. ఢిల్లీ బెంగళూరు అహ్మదాబాద్ లాంటి చోట్ల 10 – 20 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి.

పరిష్కారం :
ఇమ్మ్యూనిటీని నమ్ముకొంటే అంతా మంచే జరుగుతుంది. చక్కటి ఆహారం, వ్యాయామం, నిద్ర, భయానికి దూరంగా ఉండి జీవితాన్ని ఆనందించడం అనే పద్దతిలో తొంబై ఏళ్ళ వ్యక్తి అయినా ఇమ్మ్యూనిటి ని పెంచుకోవచ్చు. కరోనా అయినా బ్లాక్ ఫంగస్ అయినా మరొకటి అయినా జయించవచ్చు. రోగానికి విరుగుడు మందు మాత్రమే అనే పద్ధతిలో వెళితే (మందు అవసరమే).. కానీ మందే మార్గం అని అనుకోవడం తప్పు అని వెల్లడిస్తున్నారు.

Read More :  Cowin App : కొవిన్ యాప్‌.. కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ వచ్చింది.. ఇదేలా పనిచేస్తుందంటే?