Crime news: పెళ్లి చేసుకోనన్న ప్రియురాలు.. లేఖరాసి ప్రియుడు ఆత్మహత్య.. ఆ లేఖలో ఏముందంటే..

కర్ణాటక చిక్ మగళూరు జిల్లా శంకరపురంకు చెందిన 31ఏళ్ల యువకుడు చేతన్ ఓ యువతిని ప్రేమించాడు. కొన్నేళ్లు ఇద్దరు తరచూ కలుసుకుంటుండేవారు. ఈ క్రమంలో ప్రేయసి అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చాడు. కొన్నేళ్లుగా ఇలా తరచూ కలుసుకోవటం.. ఆమె అడిగిందల్లా కొనివ్వటం పరిపాటిగా మారింది.

Crime news: పెళ్లి చేసుకోనన్న ప్రియురాలు.. లేఖరాసి ప్రియుడు ఆత్మహత్య.. ఆ లేఖలో ఏముందంటే..

Young Boy Sucide

Crime news: కర్ణాటక చిక్ మగళూరు జిల్లా శంకరపురంకు చెందిన 31ఏళ్ల యువకుడు చేతన్ ఓ యువతిని ప్రేమించాడు. కొన్నేళ్లు ఇద్దరు తరచూ కలుసుకుంటుండేవారు. ఈ క్రమంలో ప్రేయసి అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చాడు. కొన్నేళ్లుగా ఇలా తరచూ కలుసుకోవటం.. ఆమె అడిగిందల్లా కొనివ్వటం పరిపాటిగా మారింది. ఇలా సుమారు రూ. 4.50 లక్షల వరకు చేతన్ ఖర్చు చేశాడు. ఇక పెళ్లిచేసుకుందామని భావించిన చేతన్ ప్రియురాలి దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. పెళ్లా.. నిన్ను పెళ్లిచేసుకోవటం నాకు ఇష్టం లేదంటూ ప్రియురాలు షాకిచ్చింది. జోక్ చేస్తుందేమోననుకొని మళ్లీమళ్లీ పలుసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవటంతో తీవ్ర మనోవేదనకు గురైన చేతన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకొనేముందు ఓ లేఖను రాశాడు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొని చూడగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..

చేతన్‌కు 31ఏళ్లు. సరకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవనం సాగించేవాడు. సరకు రవాణా చేస్తూ సంపాదించిన డబ్బును అధికశాతం ప్రేయసికే ఖర్చుచేసేవాడు. ఖరీదైన వస్తువులనుసైతం కాదనకుండా కొనిచ్చాడు. తన ప్రేయసి తనతో ఎక్కువ ఖర్చుపెట్టిస్తుందని స్నేహితుల వద్ద చెబుతూ వాపోయాడట. అయినా నాకు కాబోయే భార్యే కదా ఏమౌవుతుదిలే అని చేతన్ అంటుండేవాడని అతని స్నేహితులు తెలిపారు. ప్రియురాలు ఎప్పుడైతే పెళ్లిచేసుకోను అని చెప్పిందో అప్పటి నుంచి చేతన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, పలుసార్లు మేము సర్దిచెప్పినా ఉపయోగం లేకపోయిందని అతని స్నేహితులు వాపోయారు. పెళ్లిచేసుకోను అని చెప్పినా ప్రియురాలి వద్దకు వెళ్లి బతిమాలాడని, ఆమె ప్రవర్తనతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడని చేతన్ స్నేహితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

Kerala: ఆ ఇద్ద‌రు యువ‌తులు క‌లిసి జీవించొచ్చు.. కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పు..

చేతన్ రాసిన లేఖలో తన ప్రియురాలికి ఎంత ఖర్చు చేశాను, ఏ వస్తువు కొనుగోలుకు ఎంత ఖర్చు పెట్టాను అనే వివరాలను రాసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో తన ప్రియురాలు సరదాల కోసం దాదాపు రూ.450 లక్షలు ఖర్చు చేసినట్లు చేతన్ రాశాడని పోలీసులు తెలిపారు. ఆమెను చాలా ప్రేమించానని, ఆమె కోసం ఖర్చు పెట్టిన మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని లేఖలో చేతన్ కోరాడు. చేతన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.