Bride Escaped: పెళ్లైన గంటకే పారిపోయిన వధువు

అతడో మధ్యస్థాయి వ్యాపారవేత్త.. 33 సంవత్సరాలు ఉంటాయి. కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. చివరికి ఓ సంబంధం కుదిరింది. పెళ్ళికుదిరిందని ఎంతో సంతోషపడ్డాడు.

Bride Escaped: పెళ్లైన గంటకే పారిపోయిన వధువు

Bride Escaped

Bride Escaped:  అతడో మధ్యస్థాయి వ్యాపారవేత్త.. 33 సంవత్సరాలు ఉంటాయి. కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. చివరికి ఓ సంబంధం కుదిరింది. పెళ్ళికుదిరిందని ఎంతో సంతోషపడ్డాడు. జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నాడు. కానీ ఇంతలోనే పెళ్లికూతురు గట్టి షాక్ ఇచ్చింది. ఇంకేముంది అతడి ఆశలు ఆవిరై పోయాయి. వివరాల్లోకి వెళితే కర్ణాటకు చెందిన అంకిత్ జైన్ గత కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే గుజరాత్ లోని సూరత్ కు చెందిన మధ్యవర్తి సతీష్ పటేల్ ద్వారా ఓ సంబంధం వచ్చింది. అమ్మాయి లక్షణంగా ఉండటంతో పెళ్ళికి సిద్దమయ్యాడు. పెళ్లి సంబంధం చూసిన మధ్యవర్తికి పెళ్లి కాకముందే రూ.20 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత పెళ్లికూతురు స్వాతీభట్‌ అన్నకి పెళ్లి ఖర్చుల నిమిత్తం లక్ష యాభై వేలు ముట్టచెప్పాడు. ఇక కాబోయే కోడలి కోసం అంకిత్ తల్లి రూ. 20 వేలు పెట్టి బంగారు ఉంగరం తెచ్చింది.

ఇక పెళ్లి అంగుఆర్భాటం లేకుండా చేసుకుందామని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ లోని కపోద్రా ప్రాంతంలోగల ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. దేవాలయం నుంచి యువతి పుట్టింటికి కారులో వెళ్తున్నారు వధువరులు.. ఈ క్రమంలోనే తాను స్నాన్స్ తిని వాష్ రూమ్ కి వెళ్లివస్తా కారు ఆపండి అని చెపింది. కారు ఆపగానే దిగిన పెళ్లికూతురు స్వాతీభట్‌ ఏటో వెళ్ళిపోయింది.

గంటకు పైగా వెతికినా కనిపించలేదు. దీంతో సంబంధం కుదిర్చిన మధ్యవర్తికి ఫోన్ చేశాడు వరుడు.. తాను యువతి సోదరుడికి ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పాడు మధ్యవర్తి. అయితే ఫోన్ చేస్తే ఇద్దరు లిఫ్ట్ చెయ్యలేదు.. దీంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు యువకుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతీభట్‌ కోసం గాలిస్తున్నారు. కాగా పెళ్లి జరిగిన గంటకే వధువు పారిపోవడంతో వరుడి ఆశలు అడియాశలయ్యాయి.