Bride: పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆస్పత్రి పాలు

పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆసుపత్రి పాలైంది. భర్త, అత్త నవవధువుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇనుప చువ్వలతో కాల్చడంతో శరీరంపై వాతలు పడ్డాయి.

Bride: పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆస్పత్రి పాలు

Bride

Bride: పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన నవవధువు మూడురోజులకే ఆసుపత్రి పాలైంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని జరీఫానగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్ పూర్ కు చెందిన సునీల్ కు సిద్ధార్ పూర్ కు చెందిన ఊర్మిళతో జూన్ 21న వివాహం జరిగింది. వివాహం రోజునే ఒప్పుకున్నంత కట్నం చెల్లించారు వధువు తల్లిదండ్రులు.

అయితే పెళ్ళైన మరునాడు ఊర్మిళ అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆ రోజు నుంచే ఆమెపై వేధింపులు మొదలైనట్లు స్థానికులు తెలిపారు. జూన్ 24వ తేదీన సునీల్, ఊర్మిళపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె శరీరంపై రక్తపు గాయాలయ్యాయి. కాల్చిన ఇనుప చువ్వలతో వాతలు పెట్టారు. ఈ విషయం స్థానికుల ద్వారా ఊర్మిళ తండ్రికి తెలియడంతో అతడు ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

ప్రస్తుతం ఊర్మిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ప్రైవేట్ భాగాలపై 9 కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. కూతురిని ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఊర్మిళ భర్త సునీల్, ఆమె అత్తను అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం, వరకట్న నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.