Bihar: పెళ్లయిన మూడోరోజే ప్రియుడితో భర్తను హత్య చేయించిన వధువు.. వారంలోనే ప్రియుడుకూడా మృతి.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు

పెళ్లయిన మూడోరోజే నవ వధువు తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటన జరిగిన వారంరోజుల్లోనే ప్రియుడు కూడా మరణించాడు. వరుస మరణాలపై పోలీసులు విచారణ చేపట్టగా నవవధువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

Bihar: పెళ్లయిన మూడోరోజే ప్రియుడితో భర్తను హత్య చేయించిన వధువు.. వారంలోనే ప్రియుడుకూడా మృతి.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు

Wife Killed Husband

Wife Killed Husband: బీహార్ రాష్ట్రం గయా జిల్లాలోని గురువా బ్లాక్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన మూడవ రోజుకే వరుడు చనిపోయాడు. రక్తపు మడుగులో కాలువ ఒడ్డున వరుడు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పెళ్లయిన మూడు రోజులకే వరుడు మరణించడంతో కుటుంబంలో విషాదం అలముకుంది. వరుడు మృతికి కారణాలు కనుగొనేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.. ఈ క్రమంలో వధువు చెప్పిన విషయాలతో పోలీసులు అవాక్కయ్యారు.

Manipur Violence: మణిపూర్‌లో దారుణం.. అంబులెన్సుకు నిప్పంటించిన అల్లరిమూకలు.. ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే29న లక్డార గ్రామానికి చెందిన అశోక్ కుమార్ యాదవ్‌కు, రేవతి కుమారికి వివాహం జరిగింది. పెళ్లయిన మూడు రోజులకే అశోక్ యాదవ్ కనిపించకుండా పోయాడు. అశోక్ సోదరుడు ధర్మేంద్ర పోలీస్ స్టేషన్‌కువెళ్లి తనఅన్న కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా కాలువ ఒడ్డున అశోక్ మృతదేహాన్ని గుర్తించారు. కేసు విచారణలో భాగంగా మృతుడు భార్య రేవతి కుమారి‌పై పోలీసులకు అనుమానం రావడంతో ఆమెను విచారించారు. తొలుత తనకు ఏమీ తెలియదని చెప్పింది. అయితే, ఆమెలో కంగారు కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాన్ని ఒప్పుకుంది. తన భర్తను నేనే చంపించానని తెలిపింది. అంతేకాదు, పెళ్లిరోజే చంపేద్దామని అనుకున్నామని, కానీ ఆరోజు కుదరక పోవటంతో మూడు రోజుల తరువాత అదును చూసుకొని హత్య చేయడం జరిగిందని తెలిపింది.

Austrian Train Fire Breaks Out: ఆస్ట్రియన్ రైలులో చెలరేగిన మంటలు..45 మంది ప్రయాణికులకు గాయాలు

పెళ్లిఅయిన మూడోరోజే ఎందుకు హత్యచేయించాల్సి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరాతీయగా.. అక్రమ సంబంధమే కారణమని తేలింది. పెళ్లికి ముందే బంధువు, వరుసకు బావమరిది అయిన ఉపేంద్ర యాదవ్‌తో రేవతి కుమారి శారీరక సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఇంట్లో కుదిర్చిన సంబంధం చేసుకోవాల్సి వచ్చింది. వీరిద్దరూ పెళ్లిరోజే అశోక్ కుమార్‌ను హత్యచేసేందుకు నిర్ణయించకున్నారు. కానీ ఆ రోజు వీలుకాకపోవటంతో జూన్ 1న ఉపేంద్ర యాదవ్ అశోక్ కుమార్‌ను హత్యచేశాడు.

Madhya Pradesh Woman Elopes: ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌తో కలిసి కేరళ స్టోరీ సినిమా చూసిన యువతి మళ్లీ పారిపోయింది…

మరోవైపు జూన్ 6న రేవతి ప్రియుడు ఉపేంద్ర యాదవ్ కూడా చనిపోయాడు. అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీటీ రోడ్డులో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు కాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే, ఉపేంద్రను ఎవరు హత్యచేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేవతి కుమారి తన భర్తను చంపిన విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని ప్రియుడినికూడా చంపించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి రేవతి వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.