Tamilnadu : డ్యాన్స్ చేసిన వధువు.. చెంప పగులగొట్టిన వరుడు, తర్వాత ట్విస్ట్

వరుడు..వారిద్దని దూరంగా నెట్టాడు. అనంతరం వధువు వేదికపైకి రాగానే...వరుడు ఆమె చెంప చెళ్లుమనిపించాడు. వెంటనే వివాహాన్ని రద్దు చేసుకోవాలని వధువు నిర్ణయించడంతో...

Tamilnadu : డ్యాన్స్ చేసిన వధువు.. చెంప పగులగొట్టిన వరుడు, తర్వాత ట్విస్ట్

Marrige

Groom Slaps Her For Dancing In Tamil Nadu :  పెళ్లి అంటే..జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని అనుకుంటుంటారు కొంతమంది. వినూత్నంగా..వెరైటీగా పెళ్లిళ్లు చేసుకుంటూ…వార్తల్లో నిలుస్తుంటారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అందులో డ్యాన్స్ లకు సంబంధించినవి. వధూవరులు, ఇతర బంధువులు డ్యాన్స్ ల వీడియోలు పోస్టులు చేస్తుంటారు. అయితే..కొన్ని సందర్భాల్లో..పెళ్లిళ్లు క్యాన్సిల్ కావడానికి కారణమౌతుంటాయి. తాజాగా..వధువు చేసిన డ్యాన్స్ తో చిర్రెత్తుకొచ్చిన వరుడు ఆమె చెంప చెళ్లుమనిపించాడు. తాను తక్కువ తిన్నానా ? అంటూ వరుడి చెంప దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో పెళ్లి కాస్తా..ఆగిపోయింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : కరోనా టెస్టుల కోసం క్యూ కట్టిన జనం _ Huge Public Rush On Covid Test Centers

కడలూరు జిల్లా పన్రిటీలో ఓ వ్యాపారవేత్త కుమార్తె నిశ్చితార్థం పెరియకట్టుపాళయానికి చెందిన ఓ వ్యక్తితో జరిగింది. గత సంవత్సరం నవంబర్ 06న జరిగిన ఈ నిశ్చితార్థంలో జనవరి 20వ తేదీన వివాహం చేయాలని ఇరు కుటుంబసభ్యుల పెద్దలు నిర్ణయించారు. వారి ఆచారాల ప్రకారం..జనవరి 19వ తేదీన వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వధూవరుల కుటుంబాలు చేరుకున్నాయి. డీజే హోరులో…డ్యాన్స్ లు చేస్తున్నారు. వధువు…వరుడు.. కూడా డ్యాన్స్ చేసినట్లు సమాచారం. కానీ…వధువు బంధువు కాబోయే జంట చేతులు పట్టుకుని డ్యాన్స్ చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది.

Read More : AP High Court : పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్.. విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

దీంతో వరుడు..వారిద్దని దూరంగా నెట్టాడు. అనంతరం వధువు వేదికపైకి రాగానే…వరుడు ఆమె చెంప చెళ్లుమనిపించాడు. వెంటనే వివాహాన్ని రద్దు చేసుకోవాలని వధువు నిర్ణయించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అక్కడనే వధువు కుటుంబానికి చెందిన వారి బంధువులలో ఒకరిని చూసి..సమీపంలో ఉన్న గుడిలో వివాహం జరిపించారు. వరుడు నేరుగా..పన్నుటి పీఎస్ కి చేరుకుని వధువు కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశాడు. పెళ్లి ఏర్పాట్ల కోసం తన కుటుంబం రూ. 7 లక్షలు ఖర్చు చేసిందని..పరిహారం ఇప్పించాలని వరుడు కోరినట్లు తెలుస్తోంది.