BRS Public Meeting : మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

BRS Public Meeting : మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

BRS meeting

BRS Public Meeting : భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో బయల్దేరి నాందేడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బహిరంగ సభ జరిగే కంధార్ లోహాకు బస్సులో చేరుకుంటారు.

ఇక కంధార్ లోహా పట్టణంలో 18 ఎకరాల్లో బహిరంగ సభ వేదికతోపాటు తాత్కాలిక షెడ్డుల నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సభా వేదికతోపాటు 50 వేల నుంచి 70 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, డేరాలతోపాటు వేసవికాలం నేపథ్యంలో కూలర్లను సైతం అమర్చారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహా పట్టణాలు గులాబీమయం అయ్యాయి. కంధార్ తోపాటు లోహా పట్టణానికి వెళ్లే మార్గాలన్నీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్స్, తోరణాలతో గులాబీమయంగా మారాయి.

CM KCR: దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సీఎం కేసీఆర్.. ఖండించిన కేటీఆర్, కవిత

బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసి స్థానిక నాయకులతో కలిసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఆదివారం జరుగబోయే సభలో కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి రేపుతోంది. కేంద్రంలో బీజేపీ గద్దె దించడమే టార్గెట్ గా జాతీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్ మొన్నటివరకు బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం పాటించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేడయంతో కాంగ్రెస్ కు విపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి.

కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్న ఆప్, సమాజ్ వాద్ పార్టీ, టీఎంసీ, జేడీఎస్ విపక్ష పార్టీలన్నీ రాహుల్ కు అండగా నిలిచాయి. కేసీఆర్ కూడా కాంగ్రెస్ ఊహించిన దాని కన్నా ఎక్కువే రియాక్ట్ అయ్యారు. రాహుల్ పై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ మంత్రులు కూడా కేంద్రంపై తీవ్రస్థాయిలో స్పందించారు. రాహుల్ కు పూర్తి మద్దతు ప్రకటించారు.

CM KCR: తెలంగాణ రైతుల్ని మేమే ఆదుకుంటాం.. ఎకరానికి పదివేలు ఇస్తాం: సీఎం కేసీఆర్

ఇక ఇదే సమయంలో ఆదివారం బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారో అన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రంపై నిప్పులు చెరగడంతోపాటు జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ తో కలిసి ప్రయాణంపై క్లారిటీ ఇస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.