ఇండో-పాక్​ బోర్డర్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం

  • Published By: venkaiahnaidu ,Published On : September 12, 2020 / 04:14 PM IST
ఇండో-పాక్​ బోర్డర్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం

భారత్‌-పాక్‌ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు. పంజాబ్‌ ఫిరోజ్‌పూర్ జిల్లా ఇండో-పాక్​ సరిహద్దు ప్రాంతంలోని ఓ పొలంలో మూడు ఏకే -47లు, రెండు ఎం -16 రైఫిళ్లను శనివారం బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.



https://10tv.in/india-china-five-point-formula-how-much-should-india-trust-china/
ఉదయం 7 గంటల సమయంలో సరిహద్దు ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ సోదాలు నిర్వహిస్తుండగా ఓ పొలంలో అనుమానస్పదంగా బ్యాగ్​ కనిపించింది. దానిని తెరచి చూడగా ఆరు మ్యాగజైన్లతో 3 ఏకే-47 రైఫిల్స్, 91 రౌండ్లు, 4 మ్యాగజైన్లతో రెండు ఎం-16 రైఫిల్స్, నాలుగు మ్యాగజైన్ ‌లతో కూడిన రెండు పిస్టల్స్, 20 రౌండ్లు తదితర ఆయుధాలు ఉన్నాయి.


వీటిని పాకిస్థాన్ నుంచి పంజాబ్​ ఫిరోజ్‌పూర్ జిల్లా అబోహార్​ ప్రాంతం గుండా దేశానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని మరికొన్ని చోట్ల బీఎస్ఎఫ్ దళాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.