బడ్జెట్ 2019 : కేంద్రం ఎన్నికల వరాలు ఇవే

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 06:39 AM IST
బడ్జెట్ 2019 : కేంద్రం ఎన్నికల వరాలు ఇవే

న్యూఢిల్లీ : జీఎస్టీలో వస్తుందని అనుకున్న డబ్బు అంతగా రాలేదు…దేశంలో పలు పరిణామాలు ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారుతున్నాయి..కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి.  ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌‌ను చక్కగా ఉపయోగించుకోవాలని అనుకుంది. బడ్జెట్‌ లో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. బడ్జెట్‌లో ఎన్నికల వరాలు ప్రకటించింది. పేద రైతులు, అసంఘటిత రంగ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. 

* బడ్డెట్ 2019లో ప్రధానమంత్రి శ్రయయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు కొత్త   పింఛన్ పథకాన్ని తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండినవారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుందని వెల్లడించారు. 

* ప్రకృతి విపత్తులకు నష్టపోయే రైతులకు 2 శాతం వడ్డీరాయితీ. ఎన్‌పీఎస్‌లో 4 శాతం అదనంగా జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 

* ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం ప్రకటించారు. ఐదు ఎకరాల్లోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ.6వేలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. రూ.2వేలు చొప్పున మూడు వాయిదాల్లో  ఈ నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు.

* అసంఘటిత రంగ కార్మికులకు కనీస పెన్షన్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి ప్రధాన మంత్రి శ్రమయోగి యోజన పథకం అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. నెలకు * రూ. 15వేలు జీతం వచ్చే కార్మికులందరికీ పీఎంఎస్‌వైఎం కింద లబ్ది చేకూరనుంది. 

* జీఎస్టీ కింద నమోదైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ ప్రకటించారు. మహిళా ఉద్యోగులకు మెటర్నటీ సెలవులను 26 వారాలకు పెంచారు. ఇకపై రూ. 21వేల జీతం వచ్చే వారికి ఈఎస్ఐ వర్తింపు ఉంటుందని మంత్రి పీయూష్ గోయల్ సభకు తెలిపారు.