సోంపురా డిజైన్‌లోనే రాముడి ఆలయం : శ్రీరామనవమికి పనులు షురూ

దేశ ప్రజలందరూ దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య భూ వివాదం కేసుకి సుప్రీంకోర్టు ఎండ్‌ కార్డ్‌ వేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 03:16 AM IST
సోంపురా డిజైన్‌లోనే రాముడి ఆలయం : శ్రీరామనవమికి పనులు షురూ

దేశ ప్రజలందరూ దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య భూ వివాదం కేసుకి సుప్రీంకోర్టు ఎండ్‌ కార్డ్‌ వేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ

దేశ ప్రజలందరూ దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య భూ వివాదం కేసుకి సుప్రీంకోర్టు ఎండ్‌ కార్డ్‌ వేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రామ్‌లల్లా న్యాస్‌కు అప్పగిస్తూ నవంబర్ 9,2019 తీర్పునిచ్చింది. దీంతో రామాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. అయోధ్య చట్టం కింద 3 నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది కోర్టు. 

కోర్టు ఆదేశాలతో ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆలయం డిజైన్ గురించి చర్చ జరుగుతోంది. దీంతో తెరపైకి చంద్రకాంత్‌ సోంపురా పేరు వచ్చింది. అయోధ్య తీర్పు వెలువడిన కొన్ని గంటలకే సోంపురా పేరు వెలుగులోకి వచ్చింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సరిగ్గా 30 ఏళ్ల క్రితమే డిజైన్‌ రూపొందించిన శిల్పి చంద్రకాంత్ సోంపురా. గుజరాత్‌ వాసి అయిన చంద్రకాంత్‌ సోంపురా(78) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్‌ చీఫ్‌ అశోక్‌ సింఘాల్‌ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్‌ గీశారు. 1990లో అలహాబాద్‌లో కుంభ మేళా సమయంలో సమావేశమైన సాధువులు ఈ ఆకృతికి సమ్మతించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన రాతి స్తంభాలను మలిచేందుకు ప్రత్యేక కార్యశాల ఏర్పాటు చేశారు.

ఈ డిజైన్‌లో తెలిపిన శిలులు ఇప్పటికే పని ప్రారంభించారు. శిల్పాలు, స్తంభాల్లో 40 శాతం వరకు చెక్కారు. నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండున్నరేళ్లు పడుతుందని చంద్రకాంత్‌ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ట్రస్ట్‌ ఏర్పాటు, వనరుల సమీకరణకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రామ మందిర నిర్మాణ నినాదానికి తోడుగా ఈ నమూనానే ఇంటింటికీ చేరింది. అందుకే ఇదే డిజైన్‌తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరో నమూనా రూపొందించి, మళ్లీ దానికి తగిన రీతిలో రాయి సమకూర్చుకోవడం అంటే.. చాలా సమయం పట్టే అవకాశం ఉంది. పైగా చంద్రకాంత్‌ సోంపురా కుటుంబమే దేశ విదేశాల్లోని వందలాది ఆలయాలకు నమూనాలను అందించింది. చంద్రకాంత్‌ సోంపురా తండ్రి ప్రభాకర్‌ సోంపురా గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయానికి, మథురలోని శ్రీకృష్ణ ఆలయానికి డిజైన్‌ అందించారు. చంద్రకాంత్‌ సోంపురా స్వయంగా 100 ఆలయాలకు శిల్పిగా వ్యవహరించారు. ఇందులో గుజరాత్‌లోని స్వామి నారాయణ్‌ మందిర్‌ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. దీంతో సోంపురా డిజైన్ కి ఓకే చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయని.. వచ్చే శ్రీరామనవమికి ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వీహెచ్‌పీ నేతలు అంటున్నారు.

సోంపురా రూపొందించిన డిజైన్ వివరాలు:
* ఆలయ నిర్మాణానికి ఆరున్నర ఎకరాల స్థలం అవసరం.  
* ఉత్తర భారతంలో ప్రఖ్యాతి గాంచిన ‘నగర’ శైలిలో ఆలయం.
* గర్భ గృహం, అంత్రల్, మహా మండపం, రంగ మండపం, ప్రవేశ మండపం.. ఇలా ఐదు భాగాలుగా ఉంటుంది. వీటి ద్వారానే రాముడి దర్శనం.
* గర్భ గృహానికి ఒక ద్వారం, మహా మండపానికి 7 ద్వారాలు.  
* ఈ ఆకృతిలో ఆలయ నిర్మాణానికి 2.75 లక్షల ఘనపుటడుగుల రాయి అవసరం. ఇప్పటికే 1.25 లక్షల ఘనపుటడుగుల రాయిని చెక్కారు.
* ఈ నమూనా ప్రకారం 270 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 132 అడుగుల ఎత్తుతో ప్రధాన ఆలయ కట్టడం ఉంటుంది. ఇందులో 81 అడుగుల మేర గోపుర శిఖరం ఉంటుంది.
* 212 స్తంభాలతో నిర్మాణం ఉంటుంది.
* ప్రధాన ఆలయం రెండంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బాల రాముడి విగ్రహం, మొదటి అంతస్తులో రామ దర్బారు ఉంటుంది. ఆ పైన ఆలయ శిఖరం ఉంటుంది.  
* ప్రధాన ఆలయానికి ఒకవైపు కథా కుంజ్‌ ఉంటుంది.  
* రాజస్తాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌ జిల్లా బన్సి పహార్‌పూర్‌ నుంచి తెచ్చిన గులాబీ రంగు రాయితో ఇప్పటికే దాదాపు 40 శాతం మేర శిల్పాల పనులు పూర్తయ్యాయి.  
* ఆలయ నిర్మాణంలో స్టీలు అవసరం లేదు.