ప్రియాంక మేడం..నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి – బీజేపీ ఎంపీ

  • Published By: madhu ,Published On : July 28, 2020 / 01:21 PM IST
ప్రియాంక మేడం..నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి – బీజేపీ ఎంపీ

ప్రియాంక మేడం నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి అంటున్నారు BJP MP అనిల్ బలూని. ఇటీవలే టీకి రావాలని బలూనీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై బలూనీ స్పందించారు.

తాను ఈ మధ్యే కాన్సర్ కు డయాలిసిస్ చేసుకున్నానని, టీ కు రాలేనన్నారు. అయితే…ఫ్యామిలీతో కలిసి డిన్నర్ కు రావాలని ప్రియాంకను ఆయన ఆహ్వానించారు. ప్రత్యేకమైన ఉత్తరాఖండ్ మీల్స్ ను ఆయన ప్రియాంక కుటుంబం కోసం తయరు చేయిస్తున్నారంట.

ఆయన్ను టీకి ఆహ్వానించడం..ఆయన..డిన్నర్ కు రావాలని చెప్పడం ఏంటీ అనుకుంటున్నారా ? దీనికి కారణం ఉంది. 1997 నుంచి కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్ బంగ్లాలో నివాసం ఉండేవారు. అయితే..కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) భద్రతను ఉపసంహరించుకుంది.

అంతేగాకుండా..ఆగస్టు 01వ తేదీలోపు..బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జులై 01వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఈమె నివాసాన్ని BJP MP అనిల్ బలూనికి కేటయించింది కేంద్రం.

ప్రస్తుతం అనీల్ గురుద్వారాలోని గవర్నమెంట్ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. బంగ్లాను ఖాళీ చేసిన అనంతరం ప్రియాంక హర్యాణాలోని గురుగ్రాంకు తాత్కాలికంగా వెళ్లనున్నారు.