సరస్వతి పుత్రిక : 600కి 600 మార్కులు

  • Published By: madhu ,Published On : July 14, 2020 / 08:53 AM IST
సరస్వతి పుత్రిక : 600కి 600 మార్కులు

శ్రమ, పట్టుదల ఉంటే..ఏదైనా సాధించవచ్చని ఎందరో నిరూపించారు. తాజాగా కష్టపడి..పట్టుదలతో చదవి..CBSE 12th పరీక్షల్లో 100 శాతం మార్కులను సాధించి రికార్డు నెలకొల్పింది. ARTS విభాగంలో ఈ ఘనత సాధించింది. ఈ విభాగంలో ఈ ఘనత సాధించడం బహుశ తొలిసారి అని విద్యావేత్తలు అంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రా రాజధాని లక్నోకు చెందిన దివ్యాంశి జైన్ (18)..సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 12వ తరగతి పరీక్ష రాసింది. ఈ ఫలితాలు 2020, జులై 13వ తేదీ సోమవారం విడుదలయ్యాయి. ఇందులో జైన్ కు 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించింది. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

పేరెంట్స్, కుటుంబసభ్యులు, టీచర్ల మార్గనిర్దేశం వల్లే..తాను ఈ ఘనతను సాధించానని జైన్ వెల్లడించింది. హిస్టరీలో బీఏ సీటు కోసం ఢిల్లీ యూనివర్సిటీకి తాను దరఖాస్తు చేయడం జరిగిందని తెలిపింది.

ఈ ఏడాది CBSE 12వ తరగతి పరీక్షలకు 11.92 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే మొదటిస్థానంలో నిలిచారు. బాలికల ఉత్తీర్ణత 92.15% కాగా, బాలురు 86.19% ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షను ట్రాన్స్‌జెండర్ల కూడా రాశారు. వీరి ఉత్తీర్ణత శాతం 66.67గా ఉన్నది. మొత్తంగా పరీక్షల్లో ఉత్తీర్ణత 88.78%గా నమోదైంది. కరోనా నేపథ్యంలో బోర్డు ఈ ఏడాది మెరిట్‌ జాబితాను విడుదల చేయలేదు.