CBSE : 10,12వ పరీక్షలపై సీబీఎస్ఈ కీలక ప్రకటన
10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ బోర్డు పరీక్షలపై గురువారం సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నవంబర్- డిసెంబర్లో ఆఫ్లైన్ విధానంలో 10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతాయని
CBSE 10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ బోర్డు పరీక్షలపై గురువారం సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నవంబర్- డిసెంబర్లో ఆఫ్లైన్ విధానంలో 10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతాయని,అందుకు సంబంధించిన డేట్ షీట్ అక్టోబర్-18న విడుదల చేయనున్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఉదయం 11:30కి పరీక్షలు ప్రారంభమవుతాయని, ఒక్కో ఎగ్జామ్ నిడివి 90 నిమిషాలు కాగా..ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు ఉంటాయని సీబీఎస్ఈ తెలిపింది.
ఇక,10 వ తరగతి మరియు 12 వ తరగతి సబ్జెక్టులను రెండు గ్రూపులు-చిన్న మరియు పెద్ద సబ్జెక్టులుగా విభజించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. విద్యార్థుల లెర్నింగ్ లాస్ నివారించడానికే ఇలా నిర్ణయించినట్లు సీబీఎస్ఈ తెలిపింది. సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు 189 పేపర్లకు నిర్వహించబడతాయి. 10 వ తరగతి మరియు 12 వ తరగతి అన్ని సబ్జెక్టులకు ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తే, అది పూర్తి కావడానికి 40-45 రోజులు పడుతుందని బోర్డు తెలిపింది. కాబట్టి మొదట మైనర్ సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహిస్తుంది, తరువాత ప్రధాన సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది.
కాగా,కరోనా కారణంగా గతంలో.. 2021-22 విద్యాసంవత్సరానికి సీబీఎస్ఈ మార్పులు చేసిన విషయం తెలిసిందే. విద్యాసంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్-ఎండ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే సిలబస్లోనూ మార్పులు చేసింది. రెండు టర్మ్ పరీక్షలు అయిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేస్తారు. ఫస్ట్ టర్మ్ పరీక్షలకు ముందే, ఇంటర్నల్ అసెస్మెంట్లు, ప్రాక్టికల్ పరీక్షలు పూర్తవుతాయి. ఇందుకోసం 50శాతం మార్కులు కేటాయిస్తారు. 2022 మార్చి-ఏప్రిల్లో సెకండ్ టర్మ్ పరీక్షలు జరగనున్నాయి.
ALSO READ ఎస్పీకి 400 సీట్లు పక్కా..ఫేక్ బాబా కథ త్వరలో ముగుస్తుంది