Madhya Pradesh : ఆయా అరాచకం-రెండేళ్ల బాలుడికి చిత్రహింసలు

పనిమనిషి అకృత్యానికి ఓ చిన్నారి మౌన రోధన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పిల్లాడిని చూసుకుంటానంటూ పనిలోకొచ్చి.. బాబుకు నరకయాతన చూపించింది. చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో .. పసివాడి అంతర్గత అవయవాలు బాగా వాచిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Madhya Pradesh : ఆయా అరాచకం-రెండేళ్ల బాలుడికి చిత్రహింసలు

servent maid

Madhya Pradesh :  పనిమనిషి అకృత్యానికి ఓ చిన్నారి మౌన రోధన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పిల్లాడిని చూసుకుంటానంటూ పనిలోకొచ్చి.. బాబుకు నరకయాతన చూపించింది. చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో .. పసివాడి అంతర్గత అవయవాలు బాగా వాచిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది.

భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగస్తలు అవటంతో.. తమ రెండేళ్ల చిన్నారిని చూసుకునేందుకు వారు పనిమనిషిని పెట్టారు. భోజనం పెట్టి నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఇక రోజూ ఇద్దరూ డ్యూటీలకు వెళ్లొస్తున్నారు. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో .. పిల్లాడిలో మార్పు రావడం మొదలైంది. ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే బాబు.. ఒక్కసారిగా డల్‌ అయ్యాడు. బాగా నీరసించిపోయాడు. ఒకటి రెండు రోజులు ఇది మామూలేలే అనుకున్న వారికి .. రోజూ అలాగే ఉండటంతో అనుమానం వచ్చింది.

వెంటనే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు .. అతను చెప్పింది విని షాక్‌ అయ్యారు. పైకి మామూలుగా కనిపిస్తున్న రెండేళ్ల చిన్నారి అంతర్గత అవయవాలు .. బాగా వాచిపోయాయి. ఇందుకు కారణం బాగా చిత్రహింసలు పెట్టడమే అన్నారు.. డాక్టర్‌. అసలు ఏం జరుగుతోందో.. ఎందుకు ఇలా అయిందో అర్ధకాక.. వైద్యుడి సలహాతో ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చారు. రెండు రోజుల తర్వాత సీసీ ఫుటేజ్‌ చూసిన దంపతులు హతాశులయ్యారు.

పనిమనిషి రజని పిల్లాడిని పెడుతున్న చిత్రహింసలు చూసి.. కన్నీటి పర్యంతం అయ్యారు. అన్నం తినకపోయినా.. వాష్‌రూమ్‌కి వెళ్లినా .. చెప్పిన మాట వినకపోయినా.. తాను ఫోన్‌ చూసుకుంటున్నప్పుడు డిస్ట్రబ్‌ చేసినా.. ఇక పనిమనిషి .. పిల్లాడిపై తన ప్రతాపం చూపిస్తోంది. కనికరం లేకుండా రెండేళ్ల చిన్నారిని చితక బాదుతోంది. జుట్టుపట్టుకుని ఈడ్చేయడం.. మెడ పట్టుకుని పైకి లేపడం.. కడుపులో ఇష్టం వచ్చినట్లు కొట్టడం చేస్తోంది.

ఇది చూసిన తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. తాము ఉన్నప్పుడు గారాబంగా చూసుకుంటున్నట్లు నటిస్తూనే.. వాళ్లు అలా గడప దాటగానే .. చిన్నారిని దారుణంగా కొడుతుండటంతో.. వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిమనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు .. రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను పనివాళ్ల దగ్గర వదిలేయాల్సి వచ్చినప్పుడు కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. అసలు ఎలా చూస్తున్నారనేదాన్ని ఓ కంట కనిపెట్టాలని పోలీసులు చెబుతున్నారు.

Also Read : Marakatha Ganapathi : 90 కిలోల ‘పంచముఖ మరకత గణపతి’ విగ్రహం..! ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షం..!!