సాధారణ, ఉప ఎన్నికలకు సీఈసీ స్పెషల్ ఆర్డర్స్

సాధారణ, ఉప ఎన్నికలకు సీఈసీ స్పెషల్ ఆర్డర్స్

కేంద్ర ఎన్నికల కమిషన్ సాధారణ, ఉప ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో .. ఎన్నికలకు సంబంధించిన పనులన్నింటినీ ఆన్ లైన్లోనే పూర్తి చేయాలని వెల్లడించింది. పోటీ చేయదలచిన అభ్యర్థులు ఆన్ లైన్ లోనే నామినేషన్ దాఖలు చేయడంతో పాటు.. దానికి అవసరమైన సెక్యూరిటీ డిపాజిట్ ను కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి.

పైగా ఎన్నికల ప్రచారమంటూ పదుల సంఖ్యలో గుమిగూడకుండా ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇంటింటి ప్రచారానికి కేవలం ఐదుగురికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది.