PM Modi Govt : పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం .. ఏం పంటకు ఎంతంటే..?

PM Modi Govt : పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం .. ఏం పంటకు ఎంతంటే..?

PM Modi Govt

PM Modi Govt : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంటలకు మద్ధతు ధరలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ లో ఖరీఫ్ సీజన్ లో పండిన పంటలకు మద్దతు ధర పెంపుకు నిర్ణయాలు తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మరి ఏఏ పంటలకు ఎటువంటి ధర ప్రకటించిందో తెలుసుకుందాం..

పెసర్లపై 10.4 శాతం మద్దతు ధర పెంచింది. దీంతో పెసర్లు క్వింటాకు రూ.8,558కి పెరిగింది. వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వరికి క్వింటాకు మద్ధతు ధర రూ.2,183 పెంచగా అదే ఏ గ్రేడ్ వరికి క్వింటాకు రూ.2,203కు పెంచింది.

పెంచిన కనీస మద్దతు ధరలు ఇలా ఉన్నాయి
వరి ఏ గ్రేడ్ క్వింటాకు రూ.143 పెంపు. దీంతో వరి క్వింటా ధర రూ. 2203కి పెరిగింది.

వరి సాధారణ గ్రేడ్ క్వింటాకు రూ.143 పెంపుతో ప్రస్తుతం క్వింటా ధర రూ.2183కి చేరింది.

కందులు క్వింటాకు రూ.400 పెంపుతో తాజా ధర క్వింటాకు రూ.7000 చేరింది.

రాగులు క్వింటాకు రూ.268 పెంపుతో క్వింటా ధర రూ.3846కి చేరింది.

పెసర్లు క్వింటాకు రూ.803 పెంపుతో తాజా ధర క్వింటాకు రూ.8558 కి పెరిగింది.

మినుములు క్వింటాకు రూ.350 పెంపుతో క్వింటా ధర రూ.6950 కి చేరింది.

సన్ ఫ్లవర్ గింజలు క్వింటాకు రూ. 360 పెంపుతో క్వింటా ధర రూ.6760 కి చేరింది.

వేరుశెనగ క్వింటాకు రూ. 527 పెంపుతో క్వింటా ధర రూ.6377 కి పెరిగింది.

సజ్జలు క్వింటాకు రూ.150 పెంపుతో సజ్జ క్వింటా ధర రూ.2500 కి చేరింది.

మొక్కజొన్నలు క్వింటాకు రూ.128 పెంపుతో ప్రస్తుతం క్వింటా ధర రూ.2090 కి చేరింది.

జొన్నలు హైబ్రిడ్ క్వింటాకు రూ.210 పెంపుతో తాజా ధర క్వింటాకు రూ.3180 కి చేరికి పెరిగింది.

జొన్నలు సాధారణ రకం క్వింటాకు రూ.235 పెంపుతో రూ.3225 కి చేరిన క్వింటా మద్దతు ధర లభించనుంది.

సోయాబీన్ ధర క్వింటాకు రూ.300 పెంపుతో సోయాబీన్ క్వింటా ధర రూ. 4600 కి చేరింది.

పత్తి మీడియం రకం క్వింటాకు రూ.540 పెంచారు. దీంతో తాజా ధర క్వింటాకు రూ.6620 కి పెరిగింది.

పత్తి పొడుగు రకం క్వింటాకు రూ.640 పెంపుతో క్వింటా రూ.7020 కు చేరకుంది.

నువ్వులు క్వింటాకు రూ.805 పెంపుతో ప్రస్తుతం నువ్వులు క్వింటా ధర రూ. 8365 కి చేరినట్లు ప్రభుత్వం పేర్కొంది.

పంటలకు మద్దతు ధర పెంపుపై మంద్రి పీయుష్ గోయర్ మాట్లాడుతు పంటలకు మద్దతు ధర పెంపు రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడం, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.