కశ్మీర్ నుంచి తక్షణమే 10 వేల జవాన్ల ఉపసంహరణ
10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని జమ్ముకశ్మీర్ నుంచి తక్షణమే ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ గతేడాది.. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్కు చేరుకున్నవారేనని అధికారులు వెల్లడించారు.
సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపును కేంద్ర హోంశాఖ సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం.. సీఆర్పీఎఫ్లోని 40 కంపెనీలు, సీఐఎస్ఎఫ్లోని 20 కంపెనీలతో పాటు బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ బలగాలు.. ఈ వారం చివరిలోగా జమ్మకశ్మీర్ను వీడుతారు.
తాజా ఉపసంహరణతో.. కశ్మీర్ లోయలో 60 బెటాలియన్ల(ప్రతి దాంట్లో 1,000 మంది) సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరికి తొడు కొద్దిమంది సీఏపీఎఫ్ సిబ్బంది ఉండనున్నారు.