కశ్మీర్​ నుంచి తక్షణమే 10 వేల జవాన్ల ఉపసంహరణ

  • Published By: venkaiahnaidu ,Published On : August 19, 2020 / 08:06 PM IST
కశ్మీర్​ నుంచి తక్షణమే 10 వేల జవాన్ల ఉపసంహరణ

10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని జమ్ముకశ్మీర్​ నుంచి తక్షణమే ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ గతేడాది.. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​కు చేరుకున్నవారేనని అధికారులు వెల్లడించారు.



సీఆర్​పీఎఫ్​ బలగాల మోహరింపును కేంద్ర హోంశాఖ సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం.. సీఆర్​పీఎఫ్​లోని 40 కంపెనీలు, సీఐఎస్​ఎఫ్​లోని 20 కంపెనీలతో పాటు బీఎస్​ఎఫ్​, ఎస్​ఎస్​బీ బలగాలు.. ఈ వారం చివరిలోగా జమ్మకశ్మీర్​ను వీడుతారు.



తాజా ఉపసంహరణతో.. కశ్మీర్​ లోయలో 60 బెటాలియన్ల(ప్రతి దాంట్లో 1,000 మంది) సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరికి తొడు కొద్దిమంది సీఏపీఎఫ్​ సిబ్బంది ఉండనున్నారు.