Covid cases : ఐదు రాష్ట్రాల్లో పెరిగిన కొవిడ్ కేసులు.. కేంద్రం కీలక ఆదేశాలు..

దేశంలో ఫోర్త్ వేవ్ మొదలైనట్లు కనిపిస్తోంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో మంగళవారం 1,247 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చితే 43శాతం....

Covid cases : ఐదు రాష్ట్రాల్లో పెరిగిన కొవిడ్ కేసులు.. కేంద్రం కీలక ఆదేశాలు..

Covid Cases

Covid cases : దేశంలో ఫోర్త్ వేవ్ మొదలైనట్లు కనిపిస్తోంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో మంగళవారం 1,247 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చితే 43శాతం కొవిడ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల నమోదు పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశంలో యాక్టివ్ కేసులు 11,860 ఉన్నాయి. గత 24 గంటల్లో 928 మంది కోవిడ్ రోగులు వ్యాధి నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,25,11,701కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.76శాతంగా ఉంది. ఇదిలాఉంటే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక సూచనలు చేసింది.

Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..

కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ ఒక లేఖలు రాశారు. అర్హులందరికీ టీకాలు వేయించాలని సూచించారు. ప్రత్యేకించి రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ను తప్పనిసరి చేయాలని రాజేష్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో గత రెండు నెలలుగా కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, అయితే రెండు వారాల క్రితంవరకు వెయ్యి కేసులు నమోదు కాగా, తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భూషణ్ ఎత్తిచూపుతూ మహమ్మారిపై ఇప్పటి వరకు చేసిన పోరాటంలో విషయం సాధించామని, ప్రస్తుతం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. ఇదే క్రమంలో ఢిల్లీలో ఏప్రిల్ నెలలో 12వ తేదీ నాటికి 998 కొత్తగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19నాటికి వాటి సంఖ్య 2,671కు చేరిందని, గత వారంలో యుటిలో సానుకూలత 1.42% నుండి 3.49%కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శి మనీషా సక్సేనాకు మింట్ సమీక్షించిన లేఖలో తెలిపారు.

Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..

అదేవిధంగా హర్యానాలో ఏప్రిల్ 12నాటికి కొత్తగా 521 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 నాటికి 1,299కు చేరినట్లు తెలిపారు. గత వారంలో రాష్ట్రంలో సానుకూలత 1.22% నుండి 2.86%కి పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 12నాటికి 217 ​​కొత్త కేసులు నమోదయ్యాయని, ఏప్రిల్ 19తో ముగిసిన చివరి వారంలో 637కొత్త కేసులు నమోదైనట్లు, దీంతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.03% నుంచి 0.09%కి పెరిగిందని తెలిపారు. అదేవిధంగా మిజోరం రాష్ట్రంలో గత వారం 19 నాటికి 539 కొత్త కేసులు నమోదయ్యాయని, అయితే పాజిటివిటీ రేటు 16.11% నుండి 16.68%కి పెరిగిందని తెలిపారు. మహారాష్ట్రలో గత వారంలో 693 కోవిడ్ కేసులను గుర్తించామని, పాజిటివిటీ రేటు 0.39% నుండి 0.40% ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కొవిడ్ వ్యాప్తి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.