వీడియోకాన్ కేసులో కొచ్చర్ దంపతులను విచారించిన ఈడీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 13, 2019 / 03:46 PM IST
వీడియోకాన్ కేసులో కొచ్చర్ దంపతులను విచారించిన ఈడీ

వీడియోకాన్ లోన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌ ను  ఇవాళ(మే-13,2019)ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. ఇదే కేసులో చందా కొచ్చార్ భ‌ర్త‌ దీపక్ కొచ్చర్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. గ‌తంలో ముంబై అధికారులు వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చందా కొచ్చార్ మేన‌ల్లుడు రాజీవ్ కొచ్చార్‌ను కూడా ముంబై, ఢిల్లీ న‌గ‌రాల్లో ప్ర‌శ్నించారు. సీబీఐ న‌మోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈడీ విచార‌ణ చేస్తున్నారు. మంగళవారం మరోసారి చందా కొచ్చర్,ఆమె భర్తను విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు.ఈ కేసులో గ‌తంలో ఈడీ అధికారులు కొచ్చార్ నివాసంలో సోదాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.